మహారాష్ట్ర భివండీలోని మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 30కు చేరింది. వీరిలో 11 మంది చిన్నారులు ఉన్నారు. సోమవారం రాత్రి నుంచి మరో ఐదుగురిని సజీవంగా బయటకు తీశారు. మొత్తం 25 మందిని రక్షించారు సహాయక సిబ్బంది.
భివండీ భవనం కూలిన ఘటనలో 30కు చేరిన మృతులు - కుప్పకూలిన భవనం
మహారాష్ట్ర భివండీలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 30కు చేరింది. రాత్రి మరో పదిహేనుకుపైగా మృతదేహాలు వెలికితీశారు అధికారులు.
భివండీ భవనం కూలిన ఘటనలో 25కు చేరిన మృతులు
శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చన్న అనుమానంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు సిబ్బంది.
సోమవారం తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో భివండీ పట్టణంలో పాత భవనం ఒకటి కూలిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది 43 ఏళ్లనాటిదని, ఆ భవనం యజమానిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు స్థానిక అధికారుల్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
Last Updated : Sep 23, 2020, 6:14 AM IST