తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు - కొండచరియలు

మహారాష్ట్రలో వర్ష బీభత్సం మళ్లీ మొదలైంది. భారీ వర్షాల కారణంగా నాసిక్ సహా పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి రవాణావ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

'మహా'లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు

By

Published : Jul 11, 2019, 1:21 PM IST

Updated : Jul 11, 2019, 2:28 PM IST

'మహా'లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు

మహారాష్ట్రను మళ్లీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వానల కారణంగా నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వరాలయం సమీపంలో వరద నీరు రోడ్లపై ప్రవహిస్తూ నదిని తలపిస్తోంది. రోడ్ల పక్కన నిలిపిన వాహనాలూ వరదల్లో కొట్టుకుపోయాయి.

తొరంగాణ ఘాట్​లో మోఖాడా, త్రయంబకేశ్వర్​ రహదారిపై భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. మోఖా​డా-నాసిక్​ల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

పాల్​ఘర్​ జిల్లాలో వరదలకు ఓ పై వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని జిల్లా అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: కాలువలో పడిన చిన్నారి.. దొరకని ఆచూకీ

Last Updated : Jul 11, 2019, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details