తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​ను ముంచెత్తిన వరదలు.. ఒకరు మృతి

భారీ వర్షాలు, వరదలతో మధ్యప్రదేశ్​లోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. భోపాల్​లోని చిరయు ఆసుపత్రిలోకి వరద నీరు చేరింది. సెహోర్​ జిల్లాలోని అస్తా నగరంలో ఓ భవనం కూలిపోయి ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

By

Published : Aug 30, 2020, 10:58 AM IST

MADYA PRADESH FLOOD SITUATION
మధ్యప్రదేశ్​ను ముంచెత్తిన వరదలు

మధ్యప్రదేశ్​ను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.

భోపాల్​లోని 'బడా తలాబ్' సరస్సు నిండుకుండలా మారి నగరంలోని చిరయు ఆసుపత్రిలోకి నీరు చేరింది. ఆసుపత్రి వార్డుల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

సెహోర్​ జిల్లాలోని అస్తా నగరంలో వరదల కారణంగా ఓ భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

అస్తా నగరంలో కూలిపోయిన భవనం
అస్తా నగరంలో కూలిపోయిన భవనం

షాజాపుర్ జిల్లాలోని చాలా​ ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. జిల్లా కేంద్రం, పరిసర లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

షాజాపుర్ జిల్లాలో నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు
వరదలో కొట్టుకుపోయిన రోడ్లు
ఉప్పొంగిన నదులు
షాజాపుర్​లో ఇళ్లల్లోకి చేరిన నీరు

మోదీకి ఫోన్​..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో..మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్ మాట్లాడారు. రాష్ట్రంలో వరద పరిస్థితిపై ప్రధానికి వివరించారు. ​

ఇదీ చూడండి:అన్​లాక్​-4: 7 నుంచి మెట్రో కూత- థియేటర్లకు నో

ABOUT THE AUTHOR

...view details