తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యక్తి పొట్టలో ఇనుప ముక్కలు... పెన్ను, పెన్సిళ్లు

మధ్యప్రదేశ్​ ఛతర్​పుర్​ జిల్లాలో కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన యువకుడి పొట్టలో నుంచి 33 వస్తువులను తొలగించారు వైద్యులు. యువకుడి మానసిక స్థితి సరిగా లేక ఇలాంటి వస్తువులను మింగినట్లు వైద్యులు పేర్కొన్నారు.

By

Published : Jul 19, 2019, 8:32 PM IST

మెంటలోడు కాదు: కానీ 33 వస్తువులు మింగాడు!

ఓ యువకుడు 33 వస్తువులు మింగాడు!

మధ్యప్రదేశ్​ ఛతర్​పుర్​ జిల్లాలోని ఓ ప్రైవేటు​ ఆసుపత్రి వైద్యులకు ఆశ్చర్యకర కేసు ఎదురయింది. ఇనుము తదితర వస్తువులు మింగి అనారోగ్యానికి గురయిన యోగిత్​ సింగ్​ అనే ముప్పై ఏళ్ల యువకుడు ఆసుపత్రిలో చేరాడు. బాధితుడిని పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స చేసి వస్తువులను బయటకు తీశారు. అందులో పెన్ను, పెన్సిల్​, ఇనుప ముక్కలు, రబ్బరు ముక్కల వంటివి సుమారు 33 వస్తువులు బయటపడ్డాయి. వాటిని చూసి వైద్యులే ఆశ్యర్యం వ్యక్తం చేశారు.

జిల్లాలోని ఇషానగర్​లో నివసించే యోగిత్​ సింగ్​కు కొద్ది రోజుల క్రితం కడుపునొప్పి సమస్య ఏర్పడింది. అప్పుడు తాను ఇనుప ముక్కలు తిన్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు. కానీ మొదట వారు నమ్మలేదు. దగ్గర్లోని ఓ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించగా అది స్పష్టమైంది.

చికిత్స కోసం బుందేల్​ఖండ్​లోని ప్రైవేటు​ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆపరేషన్​ చేసిన వైద్యులు యువకుడి పొట్ట నుంచి వస్తువులను తొలగించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. కొంతమంది ఇలా ఉంటారని, ఇది ఒక రకమైన మానసిక స్థితి మాత్రమే కానీ పిచ్చి కాదని వైద్యులు వెల్లడించారు.

" యువకుడు పలు రకాల వస్తువులు మింగాడు. అందులో పెన్ను, పెన్సిల్​, ఇనుప ముక్కలు ఉన్నాయి. అవి తినడానికి అతని మానసిక స్థితి కారణం. ఛతర్​పుర్​లో ఇలాంటి కేసు నా కెరీర్​లోనే మొదటిసారి వచ్చింది. వస్తువులను పొట్ట నుంచి బయటకు తీసినప్పుడు ఆశ్చర్యానికి గురయ్యాం. ఆపరేషన్​ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం యువకుడి పరిస్థితి నిలకడగా ఉంది."

- ఆసుపత్రి వైద్యుడు.

ABOUT THE AUTHOR

...view details