మధ్యప్రదేశ్ రాంపురాలో చంబల్ నది బీభత్సం మధ్యప్రదేశ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గాంధీసాగర్ ఆనకట్ట నిర్మాణం పూర్తి అయిన అనంతరం తొలిసారి నది పరివాహక ప్రాంత సరిహద్దు రింగ్వాల్ దాటి చంబల్ నది నీరు జనావాసాల్లోకి చేరింది. నదీ జలాలు రాంపురానగర్ను ముంచెత్తాయి. వరద పరిస్థితి తలెత్తుతుందన్న అంచనాలతో నదికి సమీపంలోని లోతట్టు ప్రాంతాలకు చెందిన 200మందిని జిల్లా అధికారులు అంతకుముందే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అర్థరాత్రి పెరిగిన ఉద్ధృతి...
రాత్రి పది గంటల అనంతరం చంబల్లో వరద తీవ్రరూపం దాల్చింది. రాంపురా బజార్ల వరకు వరద పోటెత్తింది. నదీజలాలు వాణిజ్య ప్రాంతాల వరకు చేరి ప్రజలు అటుఇటు పరుగులు పెట్టారు.
ఈ నేపథ్యంలో పట్టణానికి చేరుకున్న సీఆర్పీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు శ్రమించారు. ఇళ్లల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసే క్రమంలోనే నీటి ఉద్ధృతి పెరగసాగింది. పట్టణంలో 10-12 అడుగుల వరకు నీరు చేరింది. ప్రముఖ వాణిజ్య ప్రాంతాల్లో పడవలు తిరుగుతూ కనిపించాయి.
"రాంపురాలో రాత్రి పది గంటల అనంతరం పెద్దగా శబ్దం రావడం ప్రారంభమయింది. పరిశీలిస్తే రింగ్వాల్ పైనుంచి పట్టణంలోకి నీరు ప్రవహిస్తోంది. రెండు మూడు గంటల్లోనే రాంపురా జలమయమయింది. ఇళ్లల్లో పలువురు చిక్కుకుపోయారు. పడవల ద్వారా రక్షించడమూ కష్టంగానే ఉంది."
-స్థానికుడు
ఇదీ చూడండి: ఔరా..! రాయిని కొడితే గంట మోగుతోంది!