తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​ గవర్నర్​కు అస్వస్థత.. ఐసీయూలో చికిత్స - Governor Lalji Tandon in Lucknow

మధ్యప్రదేశ్​ గవర్నర్​ లాల్జీ టండన్​ (85) అస్వస్థతతో.. ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Madhya Pradesh Governor Lalji Tandon
మధ్యప్రదేశ్​ గవర్నర్​ లాల్జీ టండన్​కు స్వల్ప అస్వస్థత

By

Published : Jun 14, 2020, 9:28 AM IST

మధ్యప్రదేశ్​ గవర్నర్​ లాల్జీ టండన్(85)​ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు టండన్​. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

జ్వరం, మూత్రాశయ సంబంధిత సమస్యలు తలెత్తటం వల్ల లఖ్​నవూలోని మేదాంత ఆస్పత్రిలో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని ఆస్పత్రి డైరెక్టర్​, వైద్యుడు రాకేశ్​ కపూర్​ తెలిపారు.

లాల్జీ టండన్​ కొద్ది రోజులుగా తన సొంత జిల్లా లఖ్​నవూలో ఉంటున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి.

గతంలో లఖ్​నవూ లోక్​సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు టండన్​. ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వంలోనూ మంత్రిగా చేశారు.

ఇదీ చూడండి: సెయిల్‌ ఛైర్మన్‌ అనిల్​ చౌదరికి కరోనా!

ABOUT THE AUTHOR

...view details