మధ్యప్రదేశ్లో రేపే కమల్నాథ్ సర్కార్ భవితవ్యం తేలనుంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 13 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు ప్రారంభమయ్యే మొదటి రోజే (మార్చి 16) తన (గవర్నర్) ప్రసంగం పూర్తి అయిన వెంటనే అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించనున్నట్లు మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ తెలిపారు. ముఖ్యమంత్రి కమల్నాథ్ శాసనసభలో బలనిరూపణ చేసుకోవాలని ఆయన ఆదేశించారు.
"22 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు రాజీనామాలు పంపారని, వారు ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల ద్వారా తెలియజేసినట్లు నాకు తెలిసింది. మీడియా కవరేజీని నేను శ్రద్ధగా గమనించాను."- లాల్జీ టాండన్, మధ్యప్రదేశ్ గవర్నర్ (ముఖ్యమంత్రికి రాసిన లేఖలో)
కాంగ్రెస్ విప్ జారీ
మధ్యప్రదేశ్లో అధికార కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు అందరికీ విప్ జారీ చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 13 వరకు నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. బడ్జెట్ సెషన్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ విప్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి డా. గోవింద్ సింగ్.. ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు పార్టీ సభ్యులందరూ కచ్చితంగా హాజరవ్వాలని ఆదేశించారు.
జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ను కాదని భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో కమల్నాథ్ ప్రభుత్వం దినదిన గండంగా నడుస్తోంది.
రాజీనామాలకు ఆమోదం