దేశంలో వరుస ప్రమాదాలు ప్రజలను ఉలిక్కిపడేలాచేస్తున్నాయి. వేర్వేరు ఘటనల్లో పదుల సంఖ్యలో చనిపోతుంటే ఇందులో వలస కార్మికుల సంఖ్యే అధికం. మొన్నటి మహారాష్ట్ర ఔరంగాబాద్ రైలు ప్రమాదమే అందుకు ఉదాహరణ.
ట్రక్కు బోల్తా.. ఐదుగురు కార్మికులు మృతి - labourers
హైదరాబాద్ నుంచి ఉత్తర్ప్రదేశ్కు మామిడి పండ్ల లోడుతో వెళ్తున్న ట్రక్కు మధ్యప్రదేశ్లో బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. శనివారం అర్ధరాత్రి సమయంలో నర్సింగ్పుర్ పథా వద్ద ఘటన జరిగింది.
![ట్రక్కు బోల్తా.. ఐదుగురు కార్మికులు మృతి 5 labourers died, 11 injured after the truck they were in, overturned near Patha village in Narsinghpur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7134800-thumbnail-3x2-truck.jpg)
అలాంటి ఘటనే తాజాగా మధ్యప్రదేశ్లో జరిగింది. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి మామిడ పండ్ల లోడుతో వెళ్తున్న ట్రక్కు.. నర్సింగ్పుర్ జిల్లా పథా వద్ద బోల్తా పడింది. ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మరణించారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు స్థానికులు.
వీరంతా వలసకార్మికులని తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాకు ట్రక్కులో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని కలెక్టర్ తెలిపారు. వాహనంలో ఇద్దరు డ్రైవర్లు, కండక్టరు సహా మొత్తం 18 మంది ఉన్నట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.