తెలంగాణ

telangana

By

Published : Mar 9, 2019, 3:00 PM IST

Updated : Mar 9, 2019, 5:50 PM IST

ETV Bharat / bharat

'పాకిస్థాన్... మాటలు కాదు చేతలు కావాలి'

పాక్​ ప్రధాని కొత్త ఆలోచనలతో కొత్త పాకిస్థాన్​ అనే మాట్లాడుతున్నారని... అది కావాలంటే ఉగ్రవాదంపై కొత్తగా చర్యలుండాలని వ్యాఖ్యానించారు భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీష్​కుమార్​. పాక్​ రెండో విమానం కూల్చినట్లు అసత్యాలను ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు.

మాటలు కాదు చేతలు కావాలి: భారత్​

మాటలు కాదు చేతలు కావాలి: భారత్​

కొత్త(నయా) పాకిస్థాన్​ గురించి మాట్లాడుతున్న ఇమ్రాన్​ఖాన్​ ఉగ్రవాదంపై కొత్తగా(నయా) చర్యలు తీసుకోవాలని భారత్​ డిమాండ్​ చేసింది. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీష్​కుమార్​... ఉగ్రవాద నిర్మూలనకు పాక్​ నమ్మదగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

పుల్వామా దాడి అనంతరం జైషేకు వ్యతిరేకంగా మాత్రమే చర్యలు తీసుకున్నామని, దీనికి ప్రతిగా తీవ్రవాదులపై చర్యలు తీసుకోకుండా భారత్​పై పాకిస్థాన్​ దాడి చేసిందని తెలిపారు. వాయుసేన ప్రకటించినట్లు ఫిబ్రవరి 27 ఒక్క మిగ్​ 21 బైసన్​ను మాత్రమే కోల్పోయామని పునరుద్ఘాటించారు.

రెండో విమానాన్ని కూల్చినట్లు తమ దగ్గర వీడియో ఆధారాలున్నాయని పాక్ చెబుతోంది. ఒకవేళ అదే నిజమైతే..... వారం రోజుల తర్వాత కూడా ఎందుకు వాటిని అంతర్జాతీయ మీడియాకు వెల్లడించలేదు? ఆ యుద్ధ విమాన శకలాలు ఏమయ్యాయి? పైలట్​కు ఏమైంది?
- రవీష్​ కుమార్​, భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి.

తమ భూభాగం నుంచి ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలను అనుమతించమని ఇమ్రాన్​ఖాన్​ శుక్రవారం ఒక ప్రకటన చేశారు. దీనిపై స్పందిస్తూ ఇలాంటి ప్రకటనలు ఎన్నో సార్లు విన్నామని అన్నారు రవీష్​కుమార్​.

Last Updated : Mar 9, 2019, 5:50 PM IST

ABOUT THE AUTHOR

...view details