తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామిపై విమర్శలు చేయడం మానుకోవాలని డీఎంకే చీఫ్ స్టాలిన్కు సూచించింది మద్రాసు హైకోర్టు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొంది.
ముఖ్యమంత్రి, స్పీకర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ స్టాలిన్పై పరువునష్టం దావా వేసింది తమిళనాడు ప్రభుత్వం. దీనిని కొట్టివేయాలని స్టాలిన్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన జస్టిస్ సతీశ్ కుమార్.. స్టాలిన్ వ్యాఖ్యలతో కోర్టు తీవ్ర అసంతృప్తి చెందినట్టు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:-తలైవా.. తమిళ రాజకీయాలను మార్చేస్తారా?