తెలంగాణ

telangana

By

Published : Feb 10, 2020, 10:15 AM IST

Updated : Feb 29, 2020, 8:17 PM IST

ETV Bharat / bharat

విహార యాత్రలో విషాదం- 23 మంది పిల్లలకు గాయాలు

గుజరాత్​ చిఖాలి సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 23 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అంక్లేశ్వర్​ నుంచి సపుతారాకు విహారయాత్రకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

luxury bus turn over
విహారయాత్రలో విషాదం

విహార యాత్రలో విషాదం

గుజరాత్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్తున్న క్రమంలో ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 23 మంది విద్యార్థులు సహా ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

అంక్లేశ్వర్ సమీపంలోని అమ్రత్​పుర గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సపుతారా ప్రాంతానికి విహారయాత్రకు వెళ్తున్నారు. బస్సు చిఖాలి సమీపంలో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 54 మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

ఇదీ చూడండి: అమ్మ, నాన్న... ఓ 'పాకిస్థానీ' శిశువు!

Last Updated : Feb 29, 2020, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details