తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అడ్వాణీ ఇలాఖాలో అమిత్​షా పోటీ? - గాంధీనగర్​ లోక్​సభ స్థానం

గుజరాత్​లోని​ గాంధీనగర్​ లోక్​సభ స్థానం నుంచి భాజపా అధ్యక్షుడు అమిత్​ షా పోటీ చేయాలని పార్టీ కార్యకర్తల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఇదే స్థానం నుంచి భాజపా అగ్రనేత లాల్​ కృష్ణ అడ్వాణీ ఎంపీగా ఉన్నారు.

భాజపా అధ్యక్షుడు అమిత్​ షా

By

Published : Mar 18, 2019, 7:44 AM IST

భాజపా అధ్యక్షుడు అమిత్​ షా
భాజపా అధ్యక్షుడు అమిత్​ షా లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసే స్థానంపై సందిగ్ధం నెలకొంది. గుజరాత్​లోని గాంధీనగర్ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేయాలని అక్కడి కార్యకర్తలు కోరుతున్నారు. ప్రస్తుతం ఇదే స్థానం నుంచి భాజపా అగ్రనేత లాల్​ కృష్ణ అడ్వాణీ ఎంపీగా ఉన్నారు.

గాంధీనగర్ లోక్​సభ స్థానంలో అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందో తెలపాలని స్థానిక నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను భాజపా పరిశీలకుల బృందం శనివారం ఆహ్వానించింది.

"అమిత్​ షానే గాంధీనగర్​ నుంచి పోటీ చేయాలని భాజపా కార్యకర్తలు కోరుతున్నారు. పార్టీ పరిశీలకుల బృందానికి ఇదే విషయం చెప్పాను. అందరూ కోరుకునే వ్యక్తినే పోటీలో నిలిపితే బాగుంటుంది. గతంలో సర్ఖేజ్​ స్థానానికి ఎమ్మెల్యేగా ఉన్నారు షా. గాంధీనగర్​ లోక్​సభ స్థానం పరిధిలో సర్ఖేజ్ భాగమే. ఇక్కడి పరిస్థితులు ఆయనకు స్పష్టంగా తెలుసు. మా ప్రతినిధిగా అమిత్​షానే సరైన వ్యక్తి. "
-కిశోర్ చౌహాన్, వెజాల్పూర్ ఎమ్మెల్యే

గాంధీనగర్​ స్థానం నుంచి ఆరు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు ఎల్​కే అడ్వాణీ.

ఇదీ చూడండి:"ప్రజలు సరైన వారినే ఎన్నుకుంటారు"

ABOUT THE AUTHOR

...view details