తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆధార్​ లేదని రేషన్​ కార్డులో పేర్లు తొలగించొద్దు'

ఆధార్​ కార్డు లేదనే కారణంగా రేషన్​ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు తొలగించకూడదని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు కేంద్ర మంత్రి రామ్​విలాస్​ పాసవాన్​. లోక్​సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈపోస్​ యంత్రాల్లో నమోదు కానివారికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

By

Published : Dec 10, 2019, 3:46 PM IST

LS-PASWAN
'ఆధార్​ లేదని రేషన్​ కార్డులో పేర్లు తొలగించొద్దు'

రేషన్​ కార్డుతో ఆధార్​ అనుసంధానంలో గందరగోళం, ఈపోస్​ యంత్రాల్లో పేర్లు రాకపోవటం కారణంగా పలు ప్రాంతాల్లో రేషన్​ సరుకులు ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన సూచనలు చేశారు కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రామ్​ విలాస్​ పాసవాన్​. ఆధార్​ లేదనే కారణంతో రేషన్​ కార్డులో ఎట్టిపరిస్థితుల్లోనూ పేరు తొలగించొద్దని కోరారు.

ఎఫ్​ఎస్​పీ దుకాణాల నిర్వహణ, ఆధార్​ అనుసంధానంపై లోక్​సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు పాసవాన్​. ఆధార్​ అనుసంధానం విఫలమైన క్రమంలో పౌరసరఫరాల ద్వారా అందే వస్తువులను పొందేందుకు తగు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

కేంద్ర మంత్రి రామ్​విలాస్​ పాసవాన్

"ఆధార్​ కార్డు లేదనే కారణంగా రేషన్​ కార్డు నుంచి కుటుంబ సభ్యుల పేర్ల తొలగింపు లేదా ఆహారధాన్యాల తిరస్కరణ వంటివి ఉండకూడదని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచిస్తున్నాం. జాతీయ స్థాయిలో 81.5 శాతం లబ్ధిదారులు, 86 శాతం రేషన్​ కార్డులు ఆధార్​తో అనుసంధానం జరిగింది. "

- రామ్​ విలాస్​ పాసవాన్​, కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి.

దేశంలోని మొత్తం 5.35 లక్షల ఎఫ్​ఎస్​పీల్లో సుమారు 4.58 లక్షల దుకాణాల ఈపోస్​ యంత్రాలతో ఆధార్​ అనుసంధానం అయినట్లు వెల్లడించారు మంత్రి.

ఇదీ చూడండి: పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా 1000 మంది శాస్త్రవేత్తల పిటిషన్​

ABOUT THE AUTHOR

...view details