తెలంగాణ

telangana

By

Published : Dec 10, 2019, 7:42 PM IST

Updated : Dec 10, 2019, 11:16 PM IST

ETV Bharat / bharat

ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ బిల్లుకు లోక్​సభ ఆమోదం

ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ నిబంధనకు 2020, జనవరి25తో గడువు తీరిపోనుంది. ఈ నేపథ్యంలో మరో పదేళ్లపాటు రిజర్వేషన్లు కల్పిచే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణకు నేడు లోక్​సభ ఆమోదం తెలిపింది. ఆయుధ చట్టంలో సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది.

sc
రిజర్వేషన్ బిల్లుకు లోక్​సభ ఆమోదం

ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ బిల్లుకు లోక్​సభ ఆమోదం

ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో మరో 10 ఏళ్లపాటు రిజర్వేషన్లు పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణకు లోక్​సభ నేడు ఆమోదం తెలిపింది. సభలో ఉన్న 352మంది సభ్యులు రిజర్వేషన్​ బిల్లుకు ఆమోదం తెలిపారు. వ్యతిరేక ఓట్లు ఎవరూ వేయలేదు. ఆయా సామాజిక వర్గాల్లో నూతన రాజకీయ నాయకత్వాన్ని సృష్టించేందుకు ఈ బిల్లు ఉపకరిస్తుందని న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.

గత 70 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్లకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్న రాజ్యాంగబద్ధమైన ఈ నిబంధన.. 2020 జనవరి 25తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు పెంచేందుకు ఉద్దేశించింది ప్రభుత్వం. అయితే నామినేటెడ్ సభ్యులుగా చట్టసభల్లోకి వస్తోన్న ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్​ పెంపుపై రాజ్యాంగ సవరణలో ఎలాంటి ప్రతిపాదన చేయలేదు సర్కారు.

మోదీ హాజరు..

రాజ్యాంగ సవరణ బిల్లు అయిన కారణంగా ఓటు విభజన ద్వారా సభ్యులు తమ మద్దతును తెలిపారు. ఓటింగ్ సందర్భంగా సభకు హాజరయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.

ఆంగ్లో ఇండియన్లపై రగడ

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచడంపై మద్దతిస్తూనే.. ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు పెంచకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు విపక్ష సభ్యులు. ఆంగ్లో ఇండియన్లు కేవలం 296మంది మాత్రమే ఉన్నారని ప్రభుత్వం పేర్కొనడం సభను తప్పుదోవ పట్టించడమేనని తృణమూల్ కాంగ్రెస్​ సభ్యుడు సౌగతారాయ్ పేర్కొన్నారు. తమిళనాడులోనే వెయ్యిమందికి పైగా ఆంగ్లో ఇండియన్లు ఉంటారని.. కేవలం 296 మంది ఉంటారని ప్రభుత్వం పేర్కొనడం సరికాదన్నారు డీఎంకె ఎంపీ కనిమొళి.

ఆయుధ చట్ట సవరణకు పెద్దల సభ ఆమోదం

అక్రమ ఆయుధాలను తయారు చేయడం, కలిగి ఉండటాన్ని నేరాలుగా పరిగణించే ఆయుధ చట్టానికి సవరణ బిల్లు నేడు రాజ్యసభలో ఆమోదం పొందింది. ప్రతిపాదిత ఆయుధ చట్ట సవరణ బిల్లు ద్వారా శిక్షా సమయాన్ని జీవితకాలానికి పెంచేందుకు ఉద్దేశించింది ప్రభుత్వం.

ఇదీ చూడండి: 'పౌరసత్వ బిల్లుపై యూఎస్​సీఐఆర్​ఎఫ్​ వ్యాఖ్యలు సరికావు'

Last Updated : Dec 10, 2019, 11:16 PM IST

ABOUT THE AUTHOR

...view details