తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గ్యాస్​ సిలిండర్​ పేలి తల్లి-కుమారుడు మృతి - tiruvannamalai gas accident

తమిళనాడు తిరువణమలైలో గ్యాస్​ సిలిండర్​ పేలి ముగ్గురు మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. మరణించిన వారిలో ఎనిమిదేళ్ల బాలుడు, అతని తల్లి ఉన్నారు.

LPG cylinder explodes, three killed; four injured in TN
గ్యాస్​ సిలీండర్​ పేలి తల్లీ,కుమారుడు మృతి

By

Published : Nov 15, 2020, 7:06 PM IST

తమిళనాడులోని తిరువణమలైలో విషాదం చోటుచేసుకుంది. గ్యాస్​ సిలిండర్​ పేలి ముగ్గురు మరణించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించగా పక్కనే ఉన్న గోడ కూలీ మరికొందరు గాయపడ్డారు.

గోడ కూలిపోవడం వల్ల ఇంట్లో అద్దెకు ఉంటున్న కామాక్షి, ఆమె కుమారుడు హేమనాథ్, పొరుగున ఉన్న చంద్ర మరణించారు. కామాక్షి భర్త జానకి రామన్, మరో కుమారుడు సురేష్ గాయపడినట్లు అధికారి తెలిపారు. గాయపడినవారిని అరాని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

స్పందించిన సీఎం...

ఈ ఘటనపై సీఎం పళనిస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయినవారి కుటుంబాలకు రెండు లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. సిలిండర్​ల విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: ఆ కుటుంబాల్లో విషాదం మిగిల్చిన 'దీపావళి'

ABOUT THE AUTHOR

...view details