తమిళనాడు ఓ ప్రేమ జంట దారుణానికిి ఒడిగట్టింది. తాము ప్రైవేటుగా కలుసుకున్నప్పుడు చూశాడని అభం శుభం తెలియని చిన్నారి అని కూడా చూడకుండా 8ఏళ్ల బాలుడిని కిరాతకంగా హత్య చేశారు యువ ప్రేమికులు. అనంతరం బాలుడి మృతదేహాన్ని కొలనులో పడేశారు.
తిరుప్పూర్ జిల్లా ఊతుకులిలో ఈ ఘటన జరిగింది. మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలుడు పవనేశ్.. బయటకు వెళ్లి గురువారం ఇంటికి తిరిగి రాలేదు. కంగారుపడిన అతని తల్లిదండ్రులు ఆ ప్రాంతమంతా వెతికినా ఎలాంటి ప్రయోజనం లేదు.
ఇంతలో పల్లగౌండెన్పలాయం కొలనులో ఓ బాలుడి మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. చిన్నారి మెడపై గాయాలు చూసి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి మృతిచెందిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు.
ఈ హత్యకు 21ఏళ్ల అజిత్, అతని 17ఏళ్ల ప్రేయసే కారణమని పోలీసులు వెల్లడించారు. వారిద్దరూ ప్రైవేటుగా కలుసుకున్నప్పుడు చూశాడనే బాలుడ్ని బలిగొన్నారని పేర్కొన్నారు. పుత్తూర్ పల్లపాయం కొలను సమీపంలో హత్య చేసి.. మృతదేహాన్ని పల్లగౌండెన్పలాయం కొలనులో పడేసినట్లు పేర్కొన్నారు.
పవనేశ్ తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న వస్త్ర సంస్థలో పనిచేస్తున్నారు. అతని సోదరుడు విఘ్నేశ్(9) నాలుగో తరగతి చదువుతున్నాడు. చిన్న కుమారుడి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది.