తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: 'గేమ్​ ఆఫ్ థ్రోన్స్​' దేశీ స్టైల్ - గేమ్​ ఆఫ్​ థ్రోన్స్

మీమ్స్​... సామాజిక మాధ్యమాల్లో ఇదో ట్రెండ్​. ఇప్పుడు మీమ్స్​నే ఆసరాగా చేసుకుని పోలింగ్ శాతం పెంచేందుకు కృషిచేస్తోంది ఎన్నికల సంఘం. కలర్​ఫుల్​ పోస్టర్లు, అదిరే పంచ్​లతో ఆకట్టుకుంటూ... యువతను ఓటింగ్​ కేంద్రాలకు నడిపించే ప్రయత్నం చేస్తోంది.

భారత్​ భేరి: 'గేమ్​ ఆఫ్ థ్రోన్స్​' దేశీ స్టైల్

By

Published : Apr 17, 2019, 7:05 PM IST

Updated : Apr 17, 2019, 8:00 PM IST

సంవత్సర సంవత్సరానికి ఓటింగ్ శాతం పడిపోతోంది. ప్రజలకు అవగాహన కల్పించటానికి ఎన్నికల సంఘంతో పాటు చాలా ప్రభుత్వ సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నాయి.

హిట్​ సిరీసైన గేమ్​ ఆఫ్ థ్రోన్స్​కు(జీఓటీ) యువతలో మంచి క్రేజ్​ ఉంది. సోమవారం నుంచి ఆఖరిదైన ఎనిమిదో సీజన్​ ప్రారంభంతో ఇది మరింత పెరిగింది. ఈ సిరీస్​లోని పాత్రల ఇతివృత్తంతో ఓటరు మహాశయులను పోలింగ్​ కేంద్రానికి రప్పించే ప్రయత్నం చేస్తున్నాయి ఎన్నికల సంఘం, ప్రెస్​ ఇన్ఫర్మేషన్​ బ్యూరో.

వీటితో పాటు ఈ మధ్య పాపులర్​ అయిన డైలాగ్​లను మీమ్స్​ కోసం వాడుతున్నాయి వివిధ సంస్థలు, పార్టీలు. కొన్ని ఆసక్తికరమైన ట్వీట్లు మీకోసం...

ఎన్నికల సంఘం...

ఎన్నికల సంఘం ఓటరు అవగాహన కోసం క్విజ్​ పోటీ నిర్వహిస్తోంది. ఇందులో మొదటి విడత పూర్తైంది. రెండో విడత కోసం గేమ్​ ఆప్​ థ్రోన్స్​ టైటిల్​ పోస్టర్​ ఇతివృత్తంతో ట్వీట్​ చేసింది.
ఏమి రాబోతుంది? అనే ప్రశ్నతో చేసిన ఈ పోస్టు ఆకట్టుకుంటోంది.

తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి జీఓటీ ఇతివృత్తంతో చేసిన ట్వీట్​ ఆకట్టుకుంటోంది.

క్రికెట్​ను కూడా ప్రచారాస్త్రంగా మార్చుకుంది ఈసీ. జాతీయ క్రికెట్​ జట్టు బౌలర్​ భువనేశ్వర్​ బౌలింగ్​ వీడియో ట్వీట్​ చేసింది.

ప్రజాస్వామ్యం అనే ఆటలో ఓటు ఒక మలుపుతిప్పే సాధనం. - ఈసీ ట్వీట్​

ఈసీ మరికొన్ని ట్వీట్లు.

పీఐబీ...

జీఓటీ పాత్రల నేపథ్యంలో ప్రెస్​ ఇన్ఫర్మేషన్ బ్యూరో చేసిన ట్వీట్​ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టులో... చిన్న వ్యక్తి వల్ల కూడా పెద్ద నీడ ఏర్పడుతుంది ఒక పాత్రతో చెప్పించింది. మరో వ్యక్తితో అందరి వద్ద ఆయుధాలు ఉండవు.. కొందరికి ఓటు అనే ఆయుధం ఉంటుందనే సందేశాన్ని చెప్పించింది.

పెద్ద, చిన్న అనేది పరిగణనలోకి రాదు. అందరి ఓటుకు సమాన హక్కు ఉంది. ఈ లోక్​సభ ఎన్నికల్లో కథానాయకుడు అవ్వండి.- పీఐబీ ట్వీట్​

పీఐబీ ట్వీట్​ చేసిన మరో పోస్టు ఆకట్టుకుంటోంది.

ఓటేయటం, ఓటేయకపోవటం పౌర బాధ్యతకు సంబంధించిన విషయం. మీకు భాద్యత ఉందా? మీ హక్కును వినియోగించుకోండి. - పీఐబీ ట్వీట్​

కాంగ్రెస్​ పార్టీ....

జీఓటీ ఇతివృత్తంలో కాంగ్రెస్​ పార్టీ భాజపాపై వ్యంగ్యంగా ట్వీట్​ చేసింది. ఈ పోస్టులో నరేంద్రమోదీని ప్రధాన విలన్​గా చిత్రీకరించింది. ఇతర ప్రతి కథానాయకులుగా అమిత్​షా, రాజ్​నాథ్​ సింగ్​, అరుణ్​జైట్లీ, యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.

ఐపీఎల్​ ఇతివృత్తంతో.....

ఈ సారి ఐపీఎల్​లో బాగా పాపులర్​ అయిన డైలాగ్​ 'ఈ సాల కప్​ నందే' అంటే తెలుగులో ఈ సారి కప్పు మనదే. ఈ డైలాగ్​ ఇతివృత్తంతో ఈ సాల ఓటు నందే అని ట్వీట్ చేశారు తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి. ఇది కూడా ఆకట్టుకుంటోంది.

Last Updated : Apr 17, 2019, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details