తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆజంఖాన్ క్షమాపణకు లోక్​సభ సభ్యుల డిమాండ్​

లోక్​సభలో భాజపా ఎంపీ రమాదేవిపై ఎస్పీ ఎంపీ ఆజంఖాన్​ చేసిన అనుచిత వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా సభ్యులందరూ తీవ్రంగా ఖండించారు. స్పందించిన స్పీకర్ ఓం బిర్లా... అన్ని పార్టీలతో సమావేశమై తగిన నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.

By

Published : Jul 26, 2019, 2:14 PM IST

ఆజంఖాన్ క్షమాపణకు లోక్​సభ సభ్యుల డిమాండ్​

సమాజ్​వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్ పార్లమెంట్​లో భాజపా ఎంపీ రమాదేవిపై చేసిన వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా సభ్యులు ఖండించారు. ఈ విషయంపై అన్ని పార్టీలతో సమావేశమై తగిన నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ ఓంబిర్లా స్పష్టం చేశారు.

క్షమాపణలు చెప్పాల్సిందే

కేంద్రమంత్రి రవిశంకర్​ ప్రసాద్​.. ఆజంఖాన్ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయనను లోక్​సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

సోనియాను అన్నప్పుడు ఏంచేశారు?

మహిళలను కించపరచడాన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదించదని ఆ పార్టీ లోక్ ​సభాపక్షనేత అధిర్ రంజన్​ చౌదరి అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని అగౌరవపరిచారని భాజపాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

తగిన చర్యలు తీసుకోండి

"మహిళలను కించపరుస్తూ ఆజమ్​ఖాన్​ చేసిన వ్యాఖ్యలను అందరూ ఖండిస్తుండడం ఆహ్వానించదగిన విషయం. ఆయనపై తప్పకుండా తగిన చర్యల తీసుకోవాలని స్పీకర్​ను కోరుతున్నాను. అయితే అధిర్​ రంజన్ వ్యాఖ్యల విషయానికొస్తే.... ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని విపక్షాలను కోరుతున్నాను.
- నిర్మలా సీతారామన్​, కేంద్ర మంత్రి

విరుచుకుపడిన స్మృతి

"ఆజమ్​ఖాన్ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నా. నిన్న లోక్​సభలో ఏమి జరిగిందో దేశమంతా చూసింది. ఇది కేవలం మహిళల సమస్యగా భావించవద్దు. పురుషులు సహా సభ్యులందరికీ ఇది మాయని మచ్చ. అందుకే అందరూ ఒకే గొంతుతో మాట్లాడమని విజ్ఞప్తి చేస్తున్నా."
- స్మృతి ఇరాని, కేంద్ర మంత్రి

ఇదీ చూడండి: 'వాజ్​పేయీ నమ్మకాన్ని సైన్యం వమ్ము చేయలేదు'

ABOUT THE AUTHOR

...view details