తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యథాతథంగానే ఎన్నికలు - సీఈసీ

నిర్దిష్ట సమయంలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని సీఈసీ సునీల్ అరోరా స్పష్టం చేశారు.

సీఈసీ సునీల్ అరోరా

By

Published : Mar 1, 2019, 5:25 PM IST

2019 సార్వత్రిక ఎన్నికలు సమయానికే జరుగుతాయని భారత ఎన్నికల ప్రధాన అధికారి సునీరా అరోరా స్పష్టం చేశారు. భారత, పాకిస్థాన్​ల మధ్య ఉద్రిక్తతల ప్రభావం ఎన్నికలపై ఉండదని తెలిపారు.

"నోటిఫికేషన్​ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. అభ్యర్థులు వారి స్వదేశంలోని వాటితో పాటు విదేశీ ఆస్తుల వివరాలు సమర్పించాలి. వీటిని ఆదాయ పన్ను శాఖ పరిశీలిస్తుంది. తప్పుడు సమాచారముంటే ఎన్నికల సంఘం వెబ్​సైట్​లో వారి వివరాలు పెడతాం. అంతేకాకుండా వారిపై తగిన చర్యలు తీసుకుంటాం."
-సునీల్ అరోరా, భారత ప్రధాన ఎన్నికల అధికారి

విద్వేష పూరిత వ్యాఖ్యలు, ఉపన్యాసాలు చేసేవారిపై కఠిన చర్యలుంటాయని ఆరోరా తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. సామాజిక మాధ్యమాలపైనా నిఘా పెడతామని చెప్పారు.

త్వరలో 'సీ-విజిల్' పేరుతో యాప్​ విడుదల చేస్తామని తెలిపారు అరోరా. దీని నుంచి ఓటరు ఫిర్యాదు చేయొచ్చని వివరించారు. దేశంలో మొత్తం 1.63,331 పోలింగ్ కేంద్రాల్లోనూ వీవీప్యాట్​లు ఉపయోగిస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details