తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిన్నగదిలో ఊపిరాడక 45 గోవుల మృతి - Chhattisgarh cows news

ఛత్తీస్​గఢ్​లో 45 గోవులు మృతిచెందాయి. మూగ జీవాలను చిన్న గదిలో బంధించడం వల్ల ఊపిరాడక మరణించాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ విచారం వ్యక్తం చేశారు.

Locked in small room, 50 cows suffocate to death in C'garh
చిన్నగదిలో ఊపిరాడక 50 గోవుల మృత్యువాత

By

Published : Jul 26, 2020, 5:30 AM IST

ఓ చిన్న గది.. అందులో 60 ఆవులు.. ఎవరు బంధించారో.. ఎందుకు బంధించారో తెలియదు.. ఎప్పటి నుంచి ఆ మూగజీవులు ఇరుకు గదిలో మగ్గిపోతున్నాయో కూడా సరైన సమాధానం లేదు. శనివారం ఉదయం ఆ భవనం నుంచి తీవ్ర దుర్గంధం వ్యాపిస్తుండటంతో స్థానికులు అక్కడకు వెళ్లి చూడగా ఈ దారుణం వెలుగు చూసింది.

ఒక చిన్న గదిలో 43 ఆవులు మృతిచెంది పడి ఉన్నాయి. మరో రెండు చికిత్స చేసే సమయంలో ప్రాణాలు వదిలాయి. మరో 15 మాత్రం ప్రాణాలతో మిగిలాయి. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లా మేద్పర్‌ గ్రామానికి చెందిన పాత పంచాయతీ భవనంలో చోటుచేసుకుంది. ఫిర్యాదు అందుకున్న జిల్లా అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. బిలాస్‌పుర్‌ అదనపు కలెక్టర్‌ నేతృత్వంలో ఈ ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటయ్యింది. ఆవుల మృతికి ఊపిరి ఆడకపోవటమే కారణమని శవ పరీక్షలో నిర్ధారణ అయ్యింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు.

ఆవుల మృతిని దురదృష్టకరమైన ఘటనగా పేర్కొన్న ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌...బాధ్యులపై చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. గోవుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పలు పథకాలు కాగితాలకు పరిమితం కావటం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని విపక్ష భాజపా విమర్శించింది

ఇదీ చూడండి: క్లినికల్​ ట్రయల్స్​లో వేగం పెంచిన 'సీరం'

ABOUT THE AUTHOR

...view details