తెలంగాణ

telangana

By

Published : Apr 21, 2020, 5:33 PM IST

ETV Bharat / bharat

కుమార్తె కోసం సాహసం చేసి కానరాని లోకాలకు...

కరోనా తెచ్చిన కష్టాల కారణంగా ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. నిండు గర్భిణిగా ఉన్న కూతుర్ని చూడాలనుకున్న ఆ తండ్రి ఆశలు ఆడియాశలయ్యాయి. ఎలాగైనా కష్టపడి ఓ గంట ఈతకొట్టి కుమార్తెను చూసేస్తానని బయలు దేరిన తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

Lockdown Effect
కుమార్తెను చూసేందుకు సాహసం చేసి కానరాని లోకాలకు..!

కరోనా వైరస్​ కారణంగా దేశవ్యాప్తంగా కట్టుదిట్టంగా లాక్​డౌన్​ అమలవుతోంది. ఈ తరుణంలో నిండు గర్భిణిగా ఉన్న కూతుర్ని చూసేందుకు ఆ తండ్రి సాహసమే చేశాడు. రెండు ఊర్ల మధ్య ఉన్న కాలువలో ఈత కొట్టుకుంటూ వెళ్లి చూసొస్తానని బయలు దేరి ప్రాణాలు కోల్పోయాడు.

కుమార్తె కోసం సాహసం చేసి కానరాని లోకాలకు...

అసలేం జరిగిందంటే...

తమిళనాడు ఈరోడ్​ జిల్లాలోని పల్లిపాలయానికి చెందిన పెరుమాళ్​(60) కుమార్తె సుమతికి... హనూర్​ మండలం పుదుర్​ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. ప్రస్తుతం ఆమె 9 నెలల గర్భిణి. కాన్పు సమయం కావడం వల్ల సుమతిని శనివారం మెట్టూరు ఆస్పత్రిలో చేర్చారు. కరోనా లాక్​డౌన్​ ఉన్నా పెరుమాళ్​ ఎలాగైనా ఆమెను చూడాలని నిశ్చయించుకొన్నాడు. రెండు ఊర్ల మధ్య ఉన్న కాలువను ఈది ఆమె దగ్గరకు చేరుకోవాలని అనుకున్నాడు.

తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో మైసూర్​-మెట్టూరు ప్రధాన రహదారికి 200 మీటర్ల సమీపంలో ఉంటుందీ కాలువ. గంటసేపు ఈత కొడితే తమిళనాడులోని కరేకాడు చేరుకోవచ్చు. కానీ... కొంత సమయం తర్వాత ఈత కొట్టలేక కాలువలో మునిగి చనిపోయాడు పెరుమాళ్. తమిళనాడులోని బరగూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో అతడి​ మృతదేహం లభించింది.

కుమార్తె కోసం సాహసం చేసి కానరాని లోకాలకు...

ఇదీ చదవండి:ఫేస్​బుక్​ నుంచి త్వరలో ఉచిత గేమింగ్​ యాప్!

ABOUT THE AUTHOR

...view details