తెలంగాణ

telangana

దేశవ్యాప్తంగా 'పౌర' నిరసనలకు వామపక్షాల పిలుపు

By

Published : Dec 27, 2019, 5:06 AM IST

Updated : Dec 27, 2019, 6:47 AM IST

పౌరసత్వ చట్టం, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​కు వ్యతిరేకంగా జనవరి 1 నుంచి దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి వామపక్షాలు. జనవరి 7 వరకు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి మరుసటి రోజున బంద్​ పాటించనున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ ఆందోళనల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చాయి.

Left parties
దేశవ్యాప్తంగా 'పౌర' నిరసనలకు వామపక్షాల పిలుపు

దేశవ్యాప్తంగా 'పౌర' నిరసనలకు వామపక్షాల పిలుపు

పౌరసత్వ చట్టం, జాతీయ పౌర పట్టిక (ఎన్​ఆర్​సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్​పీఆర్​)కి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించాయి వామపక్షాలు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 7వ తేదీ వరకు ఏడు రోజుల పాటు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. జనవరి 8న బంద్​ పాటించాలని వెల్లడించాయి.

ఈ మేరకు కమ్యూనిస్టు​ పార్టీ ఆఫ్​ ఇండియా(మార్కిస్ట్​), కమ్యూనిస్టు​ పార్టీ ఆఫ్​ ఇండియా, కమ్యూనిస్ట్​ పార్టీ ఆఫ్​ ఇండియా(మార్కిస్ట్​-లెనినిస్ట్​)-లిబెరేషన్​. ఆల్ ​ఇండియా ఫార్వర్డ్​ బ్లాక్​, రెవల్యూషనరీ సోషలిస్ట్​ పార్టీలు.. సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కార్మిక సంఘాలకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశాయి.

" జనవరి 8న 'గ్రామీణ్​ బంద్​'కు పిలుపునిచ్చిన రైతులు, వ్యవసాయ కార్మిక సంఘాలు, పౌర సమాజ ఉద్యమానికి వామపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. భారత రాజ్యాంగంపై దాడి చేసేందుకు తీసుకొచ్చిన సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా శక్తిమంతమైన నిరసనలు చేయాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి."

- ప్రకటన.

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర్​ప్రదేశ్​, కర్ణాటక, గుజరాత్​, త్రిపురతో పాటు దిల్లీలో నిరసనకారులపై పోలీసుల చర్యలను తప్పుపట్టాయి వామపక్షాలు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిపై పోలీసులు దాడులకు పాల్పడ్డారని ఆరోపించాయి.

ఇదీ చూడండి: పెళ్లైన 17 రోజులకే అమరుడైన జవాను.. శోకసంద్రంలో భార్య

Last Updated : Dec 27, 2019, 6:47 AM IST

ABOUT THE AUTHOR

...view details