తెలంగాణ

telangana

By

Published : Aug 31, 2020, 10:22 PM IST

ETV Bharat / bharat

'ఆయన అలంకరించిన ప్రతి పదవికి వన్నె తెచ్చారు'

మాజీ రాష్ట్రపతి దివంగత ప్రణబ్ ముఖర్జీకి కాంగ్రెస్ అగ్రనేతలు నివాళులు అర్పించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​.. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన అపార అనుభవం ఉన్న గొప్ప నేత అని, అలంకరించిన ప్రతి పదవికి వన్నే తెచ్చారని కొనియాడారు సోనియా.

PRANAB
నివాళులు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ మరణం పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి దిగ్భ్రాంతికిగురిచేసిందని తెలిపారు.

"కాంగ్రెస్​ పార్టీతో పాటు దేశంలో ప్రణబ్​ అంతర్గత భాగం. విజ్ఞత, అనుభవం, సలహాలు, అనేక అంశాల్లో అవగాహన ఉన్న వ్యక్తి ప్రణబ్​. ఆయన లేకుండా పార్టీ మనుగడ ఊహించటం కష్టంగా ఉంది. ఆయన అలంకరించిన ప్రతి పదవికి ప్రత్యేకత తెచ్చారు. "

- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి

మనోవేదనకు గురయ్యా..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ప్రణబ్​కు నివాళులు అర్పించారు.

"మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దురదృష్టవశాత్తు మరణించిన వార్త విని దేశమంతా విచారం అలుముకుంది. ఈ వార్త తెలిసి నేను మనోవేదనకు గురయ్యాను. ఆయనకు దేశ ప్రజలందరితో పాటు నేను కూడా శోకతప్త నివాళులు అర్పిస్తున్నాను. ప్రణబ్ కుటుంబానికి, సన్నిహితులకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను"

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

ఆయనపైనే ఆధారపడ్డా..

ప్రణబ్​ మరణ వార్త విని తీవ్రంగా దుఃఖిస్తున్నాని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​ తెలిపారు.

"ఆయన మరణంతో దేశం ఒక గొప్ప నేతను కోల్పోయింది. భారత ప్రభుత్వంలో మేమిద్దరం చాలా దగ్గరగా కలిసి పనిచేశాం. ఆయన విస్తారమైన జ్ఞానం, ప్రజాసంబంధాల్లో అనుభవంపైనే నేను ఆధారపడ్డాను. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి" అని మన్మోహన్​ ఓ ప్రకటనలో తెలియజేశారు.

ఎల్లప్పుడూ కృతజ్ఞతతో..

ఎన్నో పదవులను అలంకరించి దేశానికి, పార్టీకి సేవ చేసిన ప్రణబ్​ ముఖర్జీకి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటామని కాంగ్రెస్ తెలిపింది. ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ట్విట్టర్​లో వీడియో విడుదల చేసింది. అయన భరత మాత ముద్దబిడ్డ అంటూ కాంగ్రెస్​ కొనియాడింది.

ఇదీ చూడండి:రాజనీతిలో సరిలేరు మీకెవ్వరూ..

ABOUT THE AUTHOR

...view details