తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సార్వత్రికం' తుది దశలో 64% పోలింగ్ - తరువాయి

సార్వత్రిక ఎన్నికల రణరంగం ముగిసింది. చివరిదైన ఏడో విడత పోలింగ్​ పూర్తయింది. మొత్తం 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 59 స్థానాలకు ఓటింగ్​ జరిగింది. అక్కడక్కడా ఈవీఎంల సమస్యలు, చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

ఓట్ల పండుగ సమాప్తం... ఫలితమే తరువాయి...

By

Published : May 19, 2019, 5:00 PM IST

Updated : May 19, 2019, 9:32 PM IST

2019 సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. చివరిదైన ఏడో విడత పోలింగ్ పూర్తయింది. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. ఏడో దశలోనూ కొన్ని కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి.

తుది దశలో 64శాతం పోలింగ్​ నమోదైంది.

బంగాల్..​ అదే తీరు

బంగాల్​లో ఈ విడతలోనూ ఉద్రిక్తతలు కొనసాగాయి. జాదవ్​పుర్​ లోక్​సభ స్థానంలో భాజపా మండలాధ్యక్షుడిపై తృణమూల్​ కార్యకర్తలు దాడులు చేశారు. బిహార్​, ఉత్తరప్రదేశ్​లోనూ చిన్నచిన్న ఘర్షణలు జరిగాయి.

ఓటు వేసిన ప్రముఖులు

ఈ ఎన్నికల్లో ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంగాల్​ సీఎం మమతా బెనర్జీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్​, కాంగ్రెస్ నేత శతృఘ్న సిన్హా, దీదీ మేనల్లుడు అభిషేక్​ బెనర్జీ, భారత క్రికెట్​ మాజీ సారథి సౌరవ్​ గంగూలీ ఓటు వేశారు.

Last Updated : May 19, 2019, 9:32 PM IST

ABOUT THE AUTHOR

...view details