తెలంగాణ

telangana

'లాలూకు బెయిల్​పై విచారణ వాయిదా'

రాష్ట్రీయ జనతాదళ్​(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్​ బెయిల్​ పిటిషన్​పై​ విచారణను ఝార్ఖండ్​ హైకోర్టు 27వ తేదీకి వాయిదా వేసింది. కేసుకు సంబంధించి నివేదిక ఇవ్వటానికి సీబీఐ అదనపు సమయం కోరటం వల్ల కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

By

Published : Nov 6, 2020, 4:49 PM IST

Published : Nov 6, 2020, 4:49 PM IST

Updated : Nov 6, 2020, 5:02 PM IST

Lalu's bail hearing in Dumka treasury case deferred to Nov 27
'లాలూ బెయిల్​పిటిషన్​ విచారణ వాయిదా'

రాష్ట్రీయ జనతాదళ్​(ఆర్జేడీ) అధినేత, బిహార్​ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్​ బెయిల్​ పిటిషన్​పై​ విచారణను ఝార్ఖండ్​ హైకోర్టు నవంబరు 27కు వాయిదా వేసింది. లాలూ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వటానికి ఇంకొంత సమయం కావాలని సీబీఐ కోరటమే ఇందుకు కారణం.

'లాలూ ప్రసాద్​ అనారోగ్యం కారణంగా ప్రస్తుతం ఆయన రాంచీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇప్పటికే సగం శిక్షను అనుభవించారు. అనారోగ్యం దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలి' అని అభ్యర్థించారు లాలూ తరఫు న్యాయవాది కపిల్ సిబల్. సీబీఐ కావాలనే కేసును వాయిదా వేయిస్తోందని ఆరోపించారు. అయితే ఈ వాదనల్ని సీబీఐ తోసిపుచ్చింది.

బెయిల్ వస్తే విడుదల

1990ల్లో లాలూ ప్రసాద్​ యాదవ్​ బిహార్ మఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాణా కుంభకోణం జరిగింది. దీనికి సంబంధించి ఆయనపై 3 కేసుల్లో దోషిగా తేలారు. ఈ మూడు కేసుల్లో ఇదివరకే లాలూకు బెయిల్​ వచ్చింది. కానీ దుమ్కా ట్రెజరీ కేసు మాత్రం ఇంకా పెండింగ్​లోనే ఉంది. ఇప్పుడు ఈ కేసులో బెయిల్ మంజూరైతే లాలూ ప్రసాద్​ జైలు నుంచి బయటకు వస్తారు.

ఇదీ చదవండి :'9న లాలూ రిలీజ్​- 10న నితీశ్​కు ఫేర్​వెల్​'

Last Updated : Nov 6, 2020, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details