తెలంగాణ

telangana

నితీశ్​ నమ్మకద్రోహం చేశారు: లాలూ

By

Published : Oct 16, 2020, 2:43 PM IST

బిహార్​ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో.. ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది ఆర్జేడీ. అధికార జేడీయూ లక్ష్యంగా ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​.. నైతిక విలువలను కోల్పోయారని ఆరోపించారు.

Lalu Yadav slams Nitish Kumar, says he lacks policy, rule and morals
నైతిక విలువలను నితీశ్​ కోల్పోయారు:లాలూ

జేడీయూ అధినేత, బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​.. నైతిక విలువలను కోల్పోయారని ఆర్జేడీ(రాష్ట్రీయ జనతాదళ్​) అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ విమర్శించారు. అధికార దాహంతో తమను వంచించారని ట్విట్టర్​ వేదికగా ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల ప్రచార వీడియోను విడుదల చేశారు.

" అధికారం మోజులో పడి బిహార్​ను సమస్యల వలయంలో నితీశ్​ కుమార్​ పడేశారు. 2010 ఎన్నికల్లో మాతో పొత్తు పెట్టుకుని మెజారిటీ సాధించారు. 2015 ఎన్నికల్లోనూ గెలిచాక మమ్మల్ని నమ్మక ద్రోహానికి గురి చేశారు. "

-- ఆర్​జేడీ అధినేత, లాలూ ప్రసాద్​ యాదవ్​.(ట్విట్టర్​లో)

నితీశ్​ కుమార్​ 15 ఏళ్ల పాలనను విమర్శిస్తూ రూపొందించిన ప్రచార వీడియోను లాలూ ట్వీట్​కు జోడించింది ఆర్జేడీ.

ఇదీ చూడండి:బిహార్​ బరి: కాంగ్రెస్ రెండో జాబితాలో వారికి చోటు!

ABOUT THE AUTHOR

...view details