తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీజీ.. దయచేసి లద్దాఖీల మాట వినండి' - గల్వాన్ ఘర్షణ

దేశ భక్తులైన లద్దాఖ్ ప్రజలు, చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా తమ గళం విప్పుతున్నారన్నారు రాహుల్​ గాంధీ. వారి హెచ్చరికలను ప్రభుత్వం విస్మరిస్తే అది దేశానికే ప్రమాదం తెచ్చిపెడుతుందన్నారు.

Ladakhis raising voice against Chinese intrusion; ignoring warning will cost India: Rahul
లద్దాఖీల హెచ్చరికలను విస్మరించొద్దు: రాహుల్ గాంధీ

By

Published : Jul 4, 2020, 11:23 AM IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మోదీ సర్కార్​పై విరుచుకుపడ్డారు. చైనా చొరబాట్లపై లద్దాఖీ ప్రజలు చేసిన హెచ్చరికల పట్ల మోదీ సర్కార్ నిర్లక్ష్యం వహించిందని పరోక్ష విమర్శలు చేశారు.

భారత భూభాగాన్ని చైనీయులు ఆక్రమించారంటూ లద్దాఖ్​ స్థానిక ప్రజలు నినాదాలు చేస్తున్న వీడియోను రాహుల్ తన ట్విట్టర్ ఖాతాలోపోస్టు చేశారు.

"దేశభక్తులైన లద్దాఖీలు చైనా చొరబాట్లకు వ్యతిరేకంగా తమ స్వరం వినిపిస్తున్నారు. వారి హెచ్చరికలను విస్మరిస్తే.. అది భారతదేశానికే చేటు తెస్తుంది."

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

మోదీ సర్కార్​ను ఉద్దేశిస్తూ... 'దయ ఉంచి లద్ధాఖీల హెచ్చరికలను వినండి' అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

జూన్​ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగింది. ఈ సరిహద్దు ఘర్షణ విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్​పై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇదీ చూడండి:బుద్ధుని బోధనలు సర్వదా అనుసరణీయం: మోదీ

ABOUT THE AUTHOR

...view details