తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్​ పతనానికి అవే కారణాలు'

కాంగ్రెస్​లో సమూల మార్పులు చేపట్టాలంటూ 23 మంది సీనియర్ నేతలు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇంతటి సంక్షోభం ఏర్పడడానికి కారణాలపై నిపుణులతో చర్చాగోష్టి నిర్వహించింది ఈటీవీ భారత్.

By

Published : Aug 27, 2020, 8:04 PM IST

Lack of temperament, intra party conflict leading to Congress' downfall: EXPERTS
కాంగ్రెస్​ పతనానికి కారణాలు అవే: విశ్లేషకులు

కాంగ్రెస్​లో నాయకత్వ సమస్యపై అభిప్రాయబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీలో సంస్థాగత మార్పులకు బాటలు పరచాలని చెబుతూనే.. నాయకత్వంపైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియాకు లేఖ రాశారు. ఈ విషయంలో అసమ్మతి స్వరం వినిపించిన నేతల పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై రాజకీయ విశ్లేషకులు నీర్జా చౌదరి, సీనియర్ జర్నలిస్ట్ వినోద్ శర్మ ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు. కాంగ్రెస్​లో నెలకొన్న అనిశ్చితిపై చర్చించారు.

కాంగ్రెస్​ పతనానికి కారణాలు అవే: విశ్లేషకులు

"23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు సంస్థాగత మార్పులు కోరుకుంటూ లేఖ రాశారు. దీనిపై పార్టీ స్పందన చూస్తే అసమ్మతి స్వరం వినిపిస్తున్న వారి పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. సోనియా, రాహుల్ లేకుంటే కాంగ్రెస్ చుక్కాని కోల్పోతుంది. సమస్య కాంగ్రెస్ పార్టీ గురించి కాదు. భారత పార్లమెంటరీ వ్యవస్థలో ప్రతిపక్షం గురించి."

-నీర్జా చౌదరి, రాజకీయ విశ్లేషకులు

లేఖ రాసిన నేతలపై గాంధీ కుటుంబ విధేయులు తీవ్రంగా విరుచుకుపడ్డారని వినోద్ శర్మ పేర్కొన్నారు. కాంగ్రెస్​ వ్యవహారశైలి వల్లే రోజురోజుకూ పార్టీలో ఘర్షణలు పెరిగిపోతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details