తెలంగాణ

telangana

కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్​ దారి ఎటు?

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కాంగ్రెస్- జేడీఎస్​ పొత్తు కొనసాగింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కలిసి వస్తే చేయి కలుపుతామని, లేదంటే తమ పార్టీ (జేడీఎస్​)ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి కేంద్రీకరిస్తామని స్పష్టం చేశారు.

By

Published : Jul 24, 2019, 6:17 PM IST

Published : Jul 24, 2019, 6:17 PM IST

కలిసొస్తే ఓకే.. లేదంటే మాదారి మాదే: కుమారస్వామి

కాంగ్రెస్-జేడీఎస్​ సంకీర్ణంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. "కాంగ్రెస్ మాతో కలిసి వస్తామంటే, మేమూ చేతులు కలుపుతాం. లేదంటే మా పార్టీని మేము సొంతంగా బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడతాం" అని కుమారస్వామి స్పష్టం చేశారు.

కర్ణాటక శాసనసభలో నిన్న జరిగిన బలపరీక్షలో విఫలమై.. కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ నేపథ్యంలో జేడీఎస్​ పార్టీ, తన భవిష్యత్​ కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించింది.

"కాంగ్రెస్​తో పొత్తు కొనసాగింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ నేతలు కూడా ఈ విషయం గురించి మాతో చర్చించలేదు. వారు కలిసి వస్తామంటే, మేమూ చేతులు కలుపుతాం. లేదంటే మా పార్టీని సొంతంగా బలోపేతం చేసుకోవడంపై దృష్టి కేంద్రీకరిస్తాం." - కుమారస్వామి, జేడీఎస్​ నేత

భేదాభిప్రాయాలు లేవ్​

"కాంగ్రెస్ జాతీయపార్టీ, జేడీఎస్​ ప్రాంతీయ పార్టీ... అది తప్ప ఇరుపార్టీల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు" అని జేడీఎస్​ అధినేత హెచ్​.డి. దెవెగౌడ పేర్కొన్నారు.

"కాంగ్రెస్​తో కలిసి ప్రభుత్వంలో కొనసాగినందుకు మాకు ఎలాంటి విచారం లేదు. మాజీ ముఖ్యమంత్రి (సిద్ధరామయ్య), ఇతర సీనియర్ మంత్రులు సహా, ఎవరినీ మేము నిందించడం లేదు."-హెచ్​.డి. దేవెగౌడ, జేడీఎస్​ అధినేత, మాజీ ప్రధానమంత్రి

నా జీవితంలో ఇలాంటి దారుణం చూడలేదు

భాజపా అధినాయకత్వం.... ఎమ్మెల్యేలను దొడ్డి దారిన కొని.... సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసిందని దేవెగౌడ ఆరోపించారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దారుణం ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


ఇదీ చూడండి: 'ఆర్టీఐని 'కోరలు లేని పులి'ని చేయకండి
'

ABOUT THE AUTHOR

...view details