తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శివకుమార్​ను 4 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ

మనీలాండరింగ్​ ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్​ ఈడీ ఎదుట హాజరయ్యారు. విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు సహకరించారు డీకే. సుమారు 4 గంటలపాటు శివకుమార్​ను ప్రశ్నించింది ఈడీ.

By

Published : Aug 31, 2019, 5:03 AM IST

Updated : Sep 28, 2019, 10:45 PM IST

డీకే శివకుమార్​, కర్ణాటక మాజీ మంత్రి

శివకుమార్​ను 4 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ

దిల్లీలోని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ కార్యాలయం ఎదుట కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్​ హాజరయ్యారు. మనీలాండరింగ్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన శుక్రవారం రాత్రి 6.30గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

"చట్టాన్ని గౌరవించటం చట్ట సభ్యునిగా నా కర్తవ్యం. వాళ్లు నాకు సమన్లు జారీ చేశారు. నన్ను ఎందుకు పిలిచారో తెలియదు. మనీలాండరింగ్ అంటున్నారు. వాళ్లు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పనీయండి. నేను ఏ తప్పు చేయలేదు. స్వచ్ఛంగా ఉన్నాను. వాళ్లు ఏం అడిగినా చెబుతాను."

-డీకే శివకుమార్​, కర్ణాటక మాజీ మంత్రి

శివకుమార్​ను 4 గంటలపాటు ఈడీ ప్రశ్నించింది. కేసుకు సంబంధించి వివిధ కోణాల్లో విచారించింది. రాత్రి 11.30 గంటలకు కార్యాలయం నుంచి బయటికి వచ్చారు డీకే.

ఈ కేసు నేపథ్యంలో ముందస్తు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు డీకే. ఇందుకు న్యాయస్థానం తిరస్కరించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తూనే దిల్లీకి బయలుదేరి వెళ్లిన డీకే... తొలుత కర్ణాటక భవన్‌కు, ఆ తర్వాత తన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ నివాసానికి వెళ్లి అక్కడినుంచి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఇదీ కేసు

గతేడాది ఐటీ శాఖ జరిపిన దాడుల్లో హవాలా రూపంలో భారీగా నగదు బదిలీ జరిగినట్లు తేలింది. ఇందులో ముగ్గురు నిందితుల వాగ్మూలం ప్రకారం ఛార్జిషీటులో శివకుమార్​ను ఏ-1గా చేర్చింది ఈడీ.

ఇదీ చూడండి: అసోం ఎన్​ఆర్​సీ: 71ఏళ్ల వివాదానికి నేడే తెర!

Last Updated : Sep 28, 2019, 10:45 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details