తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ మాతృమూర్తిని కలిసిన రాష్ట్రపతి కోవింద్​ - President Ram Nath Kovind Meets PM Modi's Mother in Gujarat

ప్రధాని నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్​ మోదీని కలిశారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​. రెండు రోజుల గుజరాత్​ పర్యటనలో భాగంగా సతీమణితో కలిసి గాంధీనగర్​లోని హీరాబెన్​ నివాసానికి వెళ్లారు కోవింద్.

మోదీ మాతృమూర్తిని కలిసిన రాష్ట్రపతి కోవింద్​

By

Published : Oct 13, 2019, 1:40 PM IST

Updated : Oct 13, 2019, 3:16 PM IST

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ రెండు రోజుల గుజరాత్​ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్​ మోదీని గాంధీనగర్​లోని ఆమె నివాసంలో కలిశారు. కోవింద్​, ఆయన సతీమణి.. మోదీ తల్లితోఅరగంట పాటు ముచ్చటించారు. అనంతరం కోబాలో మహవీర్ జైన్​ ఆరాధనా కేంద్రానికి వెళ్లి ఆచార్య శ్రీ పద్మసాగర్ ​సూరిజి ఆశీర్వాదాలు తీసుకున్నారు రాష్ట్రపతి దంపతులు.

ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు పంకజ్​ మోదీతో కలిసి గాంధీనగర్​లో నివాసముంటున్నారు హీరాబెన్​.రెండు రోజుల పర్యటన కోసం శనివారం గుజరాత్​ వెళ్లారు రాష్ట్రపతి. రాజ్​భవన్​లో వారికి గవర్నర్ ఆచార్య దేవ్ వ్రాత్ ఘన స్వాగతం పలికారు.

ఇదీ చూడండి: సీబీఎల్​: ఆరో దశ పడవ పోటీల్లో విజేతగా 'నడుభాగం'

Last Updated : Oct 13, 2019, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details