తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మృత్యు వైరస్​ 'నిఫా' మళ్లీ వస్తుందా...?

గతేడాది కేరళను బెంబేలెత్తించిన మహమ్మారి నిఫా వైరస్​ మళ్లీ విజృంభించే అవకాశముందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. ఈసారి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలతో సిద్ధంగా ఉందని చెప్పారు.

By

Published : Oct 12, 2019, 3:57 PM IST

మృత్యు వైరస్​ 'నిఫా' మళ్లీ వస్తుందా...?

నిఫా... గతేడాది కేరళను వణికించిన మహమ్మారి వైరస్​. ఈ వ్యాధి విజృంభణను ఎలా నియంత్రించాలో తెలియక కేరళ ప్రభుత్వం హడలిపోయింది. ఇప్పుడు మళ్లీ నిఫా ముప్పు పొంచి ఉందని తెలిపారు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ.

ప్రమాదకర వైరస్​ గురించి ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు శైలజ. వ్యాధిని నియంత్రించేందుకు ప్రభుత్వం ముందు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉందన్నారు. ఈటీవీ భారత్ ముఖాముఖిలో ఈ విషయాన్ని వెల్లడించారు కేరళ ఆరోగ్య మంత్రి.

" ఈ సారి ముందు జాగ్రత్త చర్యలతో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేరళలోని ప్రభుత్వ ల్యాబ్, పుణెకు చెందిన బయోలాజికల్ ల్యాబ్​ మాకు సాయం అందిస్తోంది."

-కేకే శైలజ, కేరళ ఆరోగ్య మంత్రి.

గతేడాది నిఫా విజృంభించినప్పుడు ఔషధాలు అందుబాటులో లేక, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో ఇబ్బందులు ఎదురైనట్లు వివరించారు శైలజ. నిఫా ఏ ప్రాంతంలోనైనా, ఎప్పుడైనా వ్యాప్తి చెందే అవకాశముందన్నారు మంత్రి. అందరూ అప్రమత్తంగా ఉండాలని, గబ్బిలాలు కొరికిన పండ్లను తినొద్దని సూచించారు.

నిఫాతో గతేడాది కేరళ బెంబేలు..

2018లో మృత్యు వైరస్​ నిఫా కారణంగా కేరళ హడలిపోయింది. 18 కేసులు నమోదయ్యాయి. వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జూన్​లో ఓ 23 ఏళ్ల విద్యార్థికి నిఫా వైరస్​ సోకింది. వెంటనే దానిని నియంత్రించగలిగారు. పెను ప్రమాదం తప్పింది.

అందుకే నిఫా అని పేరు...

గబ్బిలాల నుంచి జంతువులు, మనుషులకు వ్యాపిస్తుంది నిఫా. సాధారణంగా ఆ వైరస్.. వరాహాలు, శునకాలు, గుర్రాలకు వ్యాప్తి చెందుతుంది. ఒకవేళ మనుషుల్లోకి ప్రవేశిస్తే అత్యంత ప్రమాదం. ఈ వైరస్ సోకిన వారు తీవ్ర అస్వస్థతకు గురై మరణించే అవకాశాలుంటాయి.

నిఫా వైరస్​ను 1998-1999 మధ్య కాలంలో మలేసియాలో సుంగై నిఫా గ్రామంలో తొలిసారి గుర్తించారు. ఈ కారణంగానే ఆ వైరస్​కు నిఫా పేరు వచ్చింది.

ఇదీ చూడండి: అంతర్జాతీయ సమస్యలపై మోదీ, జిన్​పింగ్​ చర్చ

ABOUT THE AUTHOR

...view details