తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్ బిల్లు చారిత్రకం-నూతన శకానికి నాంది' - ఆమోదం

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కలిగిన 370 అధికరణ రద్దుకు పార్లమెంట్​ ఆమోదం చారిత్రాక సందర్భమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కశ్మీర్​ అంశంపై ట్వీట్ల వర్షం కురిపించారు.

కశ్మీర్ బిల్లు చారిత్రక సందర్భం-నూతన శకానికి నాంది

By

Published : Aug 7, 2019, 6:05 AM IST

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు, పునర్విభజన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం చారిత్రక సందర్భమని వ్యాఖ్యానించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కశ్మీర్​ అంశంపై వరుస ట్వీట్లు చేశారు ప్రధాని. సంకెళ్ల నుంచి విముక్తి పొంది నూతన శకం కోసం ఎదురుచూస్తోందన్నారు.

"ఐక్యంగా మనం 130 కోట్ల ప్రజల కలలను నిజం చేసుకోగలం. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇది చారిత్రక రోజు. అత్యధిక మెజారిటీతో కశ్మీర్ బిల్లులు ఆమోదం పొందాయి."

-ట్విట్టర్​లో నరేంద్రమోదీ

దశాబ్దాలుగా వేర్పాటువాద శక్తులు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. ప్రజా సంక్షేమాన్ని కశ్మీర్​నేతలు ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు.

ఇదీ చూడండి:కశ్మీర్​పై మోదీ హిట్​... కాంగ్రెస్​ 'హిట్​ వికెట్'

ABOUT THE AUTHOR

...view details