కరోనా మహమ్మారి పోరులో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముందుండి పోరాడుతున్నారు. గంటల తరబడి వ్యక్తిగత భద్రత కిట్లు(పీపీఈ) ధరించి సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో వేడి, శ్వాస ఇబ్బందులతో సతమతమవుతున్నారు. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా సుదీర్ఘకాలం పీపీఈ కిట్లను ధరించిన సందర్భంలో తలెత్తుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు కేరళ తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాల్ వైద్య కళాశాల.. సరికొత్త పరికరాన్ని రూపొందించింది. 'పవర్డ్ ఎయిర్ ప్యూరిఫయింగ్ రెస్పిరేటర్'(పీఏపీఆర్) అనే పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది.
శ్రీ చిత్ర విద్యాసంస్థ శాస్త్రవేత్తల సహాయంతో.. అదే కళాశాలలో ప్రజారోగ్య సంబంధాల విభాగంలో పనిచేస్తున్న వైద్య నిపుణుడు డాక్టర్ ప్రవీణ్ పాయ్ ఈ పీఏపీఆర్ కిట్ను అభివృద్ధి చేశారు.