తెలంగాణ

telangana

By

Published : Dec 27, 2020, 6:16 AM IST

ETV Bharat / bharat

31న అసెంబ్లీ సెషన్​- సాగు చట్టాల రద్దుకు తీర్మానం!

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మరో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక రోజు సెషన్​ను నిర్వహించనుంది కేరళ. తొలుత గవర్నర్​ తిరస్కరించినా.. ప్రభుత్వం వివరణతో ఈ నెల 31న సమావేశాల నిర్వహణకు సమ్మతి తెలిపినట్లు రాజ్​భవన్​ వర్గాలు వెల్లడించాయి.

Kerala Special Assembly Session: Decision soon, says Governor's Office
31న అసెంబ్లీ సెషన్​- సాగు చట్టాల రద్దుకు తీర్మానం!

కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ.. కేరళ అసెంబ్లీ తీర్మానం చేయనుంది. డిసెంబర్​ 31న సెషన్​ను నిర్వహించే అవకాశం ఉంది. సాగు చట్టాలపై దిల్లీలో రైతులు ఉద్యమిస్తున్న వేళ.. వారికి సంఘీభావంగా ఒక రోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఎల్​డీఎఫ్​ ప్రభుత్వం నిర్ణయించింది.

తొలుత డిసెంబర్​ 23నే ప్రత్యేక సెషన్​ను నిర్వహించేందుకు ప్రభుత్వం.. గవర్నర్​ ఆరిఫ్​ మహమ్మద్​ ఖాన్​ అనుమతి కోరగా ఆయన తిరస్కరించారు. సమావేశాలకు అంత అత్యవసరం ఏంటని ప్రశ్నించిన ఖాన్​.. ప్రభుత్వం వివరణ సరిగా లేదని అన్నారు.

ఇదీ చూడండి: చట్టాల రద్దుకు అసెంబ్లీ సెషన్​- గవర్నర్​ తిరస్కరణ

అనంతరం.. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్​ నిర్ణయం విచారకరమని ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ఆరోపించారు. కాంగ్రెస్​ కార్యకర్తలు.. రాజ్​భవన్​ ముట్టడికి యత్నించగా జలఫిరంగులు ప్రయోగించి వారిని చెదరగొట్టారు పోలీసులు.

మంత్రులు భేటీ..

అయితే.. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన గవర్నర్..​ అసెంబ్లీ సెషన్​ను నిర్వహించేందుకు సమ్మతించినట్లు రాజ్​భవన్​ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర మంత్రులు ఏకే బాలన్​, వీకే సునీల్​ కుమార్​.. గవర్నర్​ను శుక్రవారం కలిసి తమ ఉద్దేశాన్ని వివరించారు. అనంతరం.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details