తెలంగాణ

telangana

By

Published : Sep 23, 2020, 9:03 PM IST

ETV Bharat / bharat

కేరళలో రికార్డు స్థాయిలో 5,376 కొత్త కేసులు

భారత్​లో కరోనా మరింత విజృంభిస్తోంది. కొత్త కేసుల్లోనూ రికార్డులు నమోదవుతున్నాయి. కేరళలో ఒక్కరోజే 5,376 మంది వైరస్​ బారినపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరోజు కేసుల్లో ఇవే అత్యధికం. మహారాష్ట్రలో మరో 21 వేల 29 మందికి వైరస్​ సోకింది.

Kerala reports single biggest day surge, reports 5376 fresh COVID-19 cases
కేరళలో రికార్డు స్థాయిలో 5,376 కొత్త కేసులు

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 12 లక్షల 63 వేల 799కి చేరింది. బుధవారం మరో 21 వేల 29 మంది వైరస్​ బారినపడ్డారు. ఒక్కరోజే 479 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 34 వేలకు చేరువైంది. మరో 19 వేలమందికిపైగా డిశ్చార్జి అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 10 లక్షలకు చేరువైంది. కొత్త కేసుల్లో ముంబయి నుంచి అత్యధికంగా 2,360 మంది ఉన్నారు.

రికార్డు స్థాయి కేసులు..

కేరళలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 5,376 మంది మహమ్మారి బారినపడ్డారు. మరో 20 మరణాలతో.. మొత్తం మృతుల సంఖ్య 592కి చేరింది. మొత్తం కేసులు లక్షా 50 వేలకు చేరువలో ఉన్నాయి.

కర్ణాటకలో కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. బుధవారం.. 6,997 కరోనా కేసులు బయటపడ్డాయి. మరో 38 మంది మరణించారు.

బిహార్​లో 1598 కొత్త కేసులు.. ఒక మరణం నమోదైంది. రాష్ట్రంలో మొత్తం కేసులు 1.73 లక్షలకు చేరుకున్నాయి. ఇప్పటివరకు 874 మంది చనిపోయారు.

ABOUT THE AUTHOR

...view details