అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణపై సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తామని ప్రకటించింది కేరళ ప్రభుత్వం. నిర్వహణ బాధ్యతను ట్రావెన్కోర్ వంశస్థులకు అప్పగిస్తూ.. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన దేశాలను అమలు చేస్తామని తెలిపారు ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్.
" సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తోంది. సుప్రీం కోర్టు ఉత్తర్వులను విశ్లేషించాల్సి ఉంది. పూర్తిస్థాయి ఆదేశాలు ఇంకా అందలేదు. సుప్రీం తీర్పును మేము అమలు చేస్తాం. తీర్పును ప్రభుత్వం గౌరవిస్తుంది. "
- కడకంపల్లి సురేంద్రన్, కేరళ దేవాదాయ శాఖ మంత్రి.
స్వాగతించిన రాజవంశస్థులు
పద్మనాభుడి ఆలయ నిర్వహణను అప్పగిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు ట్రావెన్కోర్ రాజవంశస్థులు. తీర్పుతో చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.