తెలంగాణ

telangana

By

Published : Dec 31, 2019, 2:35 PM IST

ETV Bharat / bharat

సీఏఏ ఉపసంహరించుకోవాలని అసెంబ్లీ తీర్మానం

పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని కోరుతూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. శాసనసభలో ఏకైక భాజపా సభ్యుడు రాజగోపాల్  తీర్మానాన్ని వ్యతిరేకించగా అధికార ఎల్డీఎఫ్‌, ప్రతిపక్ష యూడీఎఫ్‌ సభ్యులు మద్దతు ప్రకటించారు.

Kerala Assembly passes resolution demanding scrapping of CAA
సీఏఏ ఉపసంహరించుకోవాలని అసెంబ్లీ తీర్మానం

పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) ఉపసంహరించాలని కోరుతూ.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కేరళ శాసనసభ ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మరో 10 ఏళ్లు కొనసాగించేలా ఆమోదం తెలిపేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశాల్లో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి విజయన్.

మతపరమైన వివక్షతో కూడుకున్న సీఏఏ.. దేశ లౌకిక విధానాలకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు విజయన్.రాజ్యాంగంలోని ప్రాథమిక విలువలు, మౌలిక సూత్రాలకు ఈ చట్టం విరుద్ధమన్నారు. కేరళలో ఎలాంటి నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయబోమని స్పష్టంచేశారు.

ఈ తీర్మానాన్ని భాజపా ఏకైక సభ్యుడు రాజగోపాల్ వ్యతిరేకించగా... అధికార వామపక్ష కూటమి సభ్యులు, ప్రతిపక్ష యూడీఎఫ్​ సభ్యులు మద్దతు పలికారు. చర్చ అనంతరం.. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలంటూ ప్రవేశపెట్టిన తీర్మాన్ని కేరళ శాసనసభ ఆమోదించింది.

ఇదీ చదవండి:నూతన సైనిక వ్యవహారాల విభాగం ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details