తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేజ్రివాల్​ను హత్య చేయాలని చూస్తున్నారా: సిసోడియా

దిల్లీ సీఎం కేజ్రీవాల్​పై దాడి వెనుక భాజపా కుట్ర ఉందని ఆమ్​ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఎన్ని దాడులు చేసినా దిల్లీ లోక్​సభ ఎన్నికల్లో ఆప్ విజయాన్ని అడ్డుకోలేరని ప్రకటించింది.

By

Published : May 4, 2019, 10:21 PM IST

Updated : May 5, 2019, 12:31 AM IST

'కేజ్రీవాల్​ను హత్య చేయాలని చూస్తున్నారా?': సిసోడియా

కేజ్రివాల్​ను హత్య చేయాలని చూస్తున్నారా: సిసోడియా

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్​పై జరిగిన దాడిని ఆమ్​ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. దాడి వెనుక భాజపా హస్తం ఉందని ఆరోపించింది.

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్​ను భాజపా చంపేందుకు ప్రయత్నిస్తోందా అని ఉప ముఖ్యమంత్రి, ఆప్​ సీనియర్​ నేత మనీశ్​ సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రివాల్​ను నైతికంగా ఏమీ చేయలేక, ఎన్నికల్లో ఓడించలేక భాజపా ఈ చర్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.

"కేజ్రివాల్​ను హత్య చేయాలని మోదీ, అమిత్​షా కోరుకుంటున్నారా? ఈ విధంగా అడ్డుతొలగించాలనుకుంటున్నారా? మీ దురాగతాలకు ముగింపు పలికేది కేజ్రీవాలే."- మనీశ్​ సిసోడియా, దిల్లీ ఉపముఖ్యమంత్రి ట్వీట్​

ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు

ముఖ్యమంత్రి కేజ్రివాల్​పై దాడిని ఆప్​ అధికార ప్రతినిధి సౌరభ్​ భరద్వాజ్​ ఖండించారు. ఈ దాడి వెనుక భాజపా కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఎన్ని దాడులు చేసిన ఆప్​ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆన్నారు.

"రోడ్​షో సమయంలో కేజ్రివాల్​పై దాడి చేశారు. ఈ పిరికిపంద చర్యను మేము ఖండిస్తున్నాం. దాడులతో... దిల్లీలో ఆప్ ప్రభంజనాన్ని ఆపలేరు." -సౌరభ్​ భరద్వాజ్​ , ఆప్ అధికార ప్రతినిధి

ఆప్​ నాటకాలు ఆడుతోంది

ఆమ్ఆద్మీ పార్టీ ఆరోపణలను దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్ తివారీ తిప్పికొట్టారు. ఆప్​ పథకం ప్రకారం 'దాడి' నాటకాలు ఆడుతోందని ప్రత్యారోపణలు చేశారు.

"మేము హింసను ప్రోత్సహించం. అలాంటి చర్యలకు పాల్పడేవారినీ సమర్థించం. అయితే ఎన్నికల సమయంలోనే ఎందుకు కేజ్రివాల్​పై దాడి జరిగింది. నాకు అనుమానంగా ఉంది. ఈ దాడి నాటకానికి కేజ్రివాలే పథకం వేసి ఉండొచ్చు." -మనోజ్ తివారి,దిల్లీభాజపా అధ్యక్షుడు

ఇదీ జరిగింది..

దిల్లీ మోతీనగర్​లో ఆప్​ ఎంపీ అభ్యర్థి బ్రిజేష్ గోయల్​ తరుపున కేజ్రివాల్​ నేడు ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్​పై ఎర్ర చొక్కా వేసుకున్న ఓ యువకుడు దాడిచేశాడు. అకస్మాత్తుగా జీపుపైకి ఎక్కి ఆయనను చెంపదెబ్బ కొట్టాడు. వెంటనే అతడిని పట్టుకున్న ఆప్​ కార్యకర్తలు చితకబాది పోలీసులకు అప్పగించారు.

ప్రస్తుతం నిందితుడు తమ కస్టడీలోనే ఉన్నాడని, అతనిని కైలాస్​ పార్క్​ ప్రాంతానికి చెందిన సురేష్​గా గుర్తించామని, దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

కేజ్రీవాల్​పై ఇలా భౌతిక దాడి జరగడం ఇది రెండోసారి. గతంలో ఆయనపై ఇంకు, స్ప్రేతోనూ దాడులు జరిగాయి.

ఇదీ చూడండి: 'మసూద్​ విషయంలో భాజపా చేసిందేమీ లేదు'

Last Updated : May 5, 2019, 12:31 AM IST

ABOUT THE AUTHOR

...view details