తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర హోంమంత్రిత్వశాఖకు బంగాల్​ గవర్నర్​ నివేదిక

బంగాల్​లో ఆదివారం నుంచి జరుగుతోన్న పరిణామాలపై ఆ రాష్ట్ర గవర్నర్ త్రిపాఠి కేంద్ర హోంమంత్రిత్వశాఖకు నివేదిక పంపారు.

By

Published : Feb 4, 2019, 10:05 PM IST

పశ్చిమ బంగ పరిణామాలపై గవర్నర్​ నివేదిక

సీబీఐ వ్యవహారంపై కోల్​కతాలో ఆదివారం రాత్రి నుంచి జరుగుతోన్న వరుస పరిణామాలపై గవర్నర్​ కేసరినాథ్ త్రిపాఠి సమగ్ర నివేదికను కేంద్ర హోంమంత్రిత్వశాఖకు (రాజ్​నాథ్​ సింగ్)​కు సమర్పించారు. బంగాల్​ ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీల నివేదికల ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు శాఖ ఈ నివేదికను రూపొందించింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..

శారదా కుంభకోణం విషయంలో కోల్​కతా పోలీస్​ కమిషనర్ రాజీవ్​కుమార్​ను ప్రశ్నించడానికి వెళ్లిన సీబీఐ అధికారులను నిర్బంధించడంతో వివాదం మొదలైంది. ఈ విషయంపై బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ప్రతిస్పందించారు. కోల్​కతా పోలీసులకు అండగా నిలిచారు. అనంతరం సీబీఐ అధికారులను విడుదల చేసినా ఉద్రిక్తత మాత్రం తగ్గలేదు.

మోదీ-షా ద్వయం పశ్చిమ బంగను నాశనం చేయడానికి కుట్రపన్నుతున్నారని మమత తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రం చర్యకు నిరసనగా 'సత్యాగ్రహ' ధర్నా చేపట్టారు. మమత బెనర్జీకి మహాకూటమి నాయకులందరూ సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​గాంధీ మమత ధర్నాకు మద్దతు తెలిపారు.

ఈ నేపథ్యంలో పశ్చిమ బంగలో జరుగుతోన్న పరిణామాలపై నివేదిక ఇవ్వాలని గవర్నర్​ త్రిపాఠిని హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్ కోరారు.
సీబీఐ అధికారులకు ముప్పు ఉందనే సమాచారంతో వారి భద్రత కోసం కేంద్ర రిజర్వ్​ దళాలను కోల్​కతాకు పంపారు.

ఎవరీ రాజీవ్​కుమార్​..

1989 ఐపీఎస్​ బ్యాచ్​కు చెందిన రాజీవ్​కుమార్​ శారదాకేసును దర్యాప్తు చేశారు. అయితే ఆ కేసుకు సంబంధించిన నివేదికలు, దస్త్రాలు సీబీఐకి అప్పగించకుండా అతను దాస్తున్నట్లు సీబీఐ ఆరోపించింది. అదే విధంగా ఎన్నికల సన్నద్ధత ఏర్పాట్లను పరిశీలిస్తోన్న కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికి హాజరుకాలేదని అతనిపై ఆరోపణలు ఉన్నాయి.

చర్యలు తప్పవు...

తాజాగా సీబీఐ అధికారులను నిర్బంధించిన విషయంలో ఐపీఎస్​ అధికారుల పాత్రను హోంమంత్రిత్వశాఖ పరిశీలిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details