తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సెలవులు ఎక్కువ ఇచ్చారు... సిలబస్​​ తగ్గించరా...? - కశ్మీర్​లో అగమ్యగోటరంగా విద్యార్థుల పరిస్థితి

కశ్మీర్​లో అధికారులు వివిధ తరగతులకు సంబంధించి వార్షిక పరీక్షల షెడ్యూల్​ను ప్రకటించారు. కానీ ఆర్టికల్​ 370 రద్దు తర్వాత కశ్మీరంతటా పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. ఇప్పటి వరకు సగం సిలబస్​ కూడా పూర్తి కాలేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సెలవులు ఎక్కువ ఇచ్చారు... సిలబస్​​ తగ్గించరా...?

By

Published : Oct 22, 2019, 7:25 PM IST

ఆర్టికల్​ 370 రద్దు తర్వాత కశ్మీర్​లో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు వివిధ తరగతులకు సంబంధించి వార్షిక పరీక్షల షెడ్యూళ్లను నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు సగం సిలబస్​ కూడా పూర్తికాకపోవటంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురి అవుతున్నారు.

సిలబస్​ పూర్తికాకుండా పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు మంచి మార్కులు సాధించలేరని వాపోతున్నారు. సిలబస్​ను తగ్గించాలని కోరుతున్నారు.

"ఆగస్టు 5 నుంచి ఇంటికి పరిమితమయ్యాము. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున తరగతులు ఏమీ జరగలేదు. ఈ పరిస్థితుల్లో చదవటం చాలా కష్టం. పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధమవ్వాలి? లోయలో ఆంక్షలు ఉన్నందున ప్రైవేట్​ ట్యూషన్స్​ జరగలేదు."
-నైలా, ప్రైవేట్​ కళాశాల విద్యార్థి, శ్రీనగర్

పాఠశాలకు వెళ్లలేదు. ప్రైవేటు ట్యూషన్స్​కు పంపటానికి తల్లిదండ్రులు సాహసించలేదు. పూర్తి సిలబల్ జరగలేదు. ఏ విధంగా వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలి​?
- ముసైబ్, 10వ తరగతి విద్యార్థి, శ్రీనగర్

విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు.

ఉపాధ్యాయులు సిలబస్‌ను పూర్తి చేయలేదు. రెండో సెమిస్టర్‌ తరగతులు జరగలేదు. ఈ పరిస్థితుల్లో అభ్యాసం కోసం ప్రైవేట్​ ట్యూషన్​ పంపించలేము. పరీక్షలను ఎలా ఎదుర్కొంటారు? ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉత్తీర్ణత మార్కులు సాధించటం వల్ల ప్రయోజనం లేదు. మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలి. ఇలాంటి ఆలోచనలతో వారు ఒత్తిడికి లోనవుతున్నారు.
- ఓ విద్యార్థి తండ్రి.

పెన్​ డ్రైవ్​ పాఠాలు...

తరగతులు జరగపోయినా విద్యార్థులకు ఎంతోకొంత నేర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి కొన్ని పాఠశాలలు. పెన్​డ్రైవ్​లలో అసైన్​మెంట్​లు నిక్షిప్తం చేసి, వాటిని విద్యార్థులకు ఇస్తున్నాయి. కొన్ని పాఠశాలలు దిగువ తరగతి విద్యార్థులకు ఇళ్ల వద్దే పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

కుదరదంతే...

షెడ్యూల్​ ప్రకారం పరీక్షలను నిర్వహిస్తామని, సిలబస్​ తగ్గించటం కుదరదని రాష్ట్ర విద్యాశాఖాధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:రేప్​ గురించి ఎంపీ భార్య చెప్పిన 'ఎంజాయ్​మెంట్​ థియరీ'

ABOUT THE AUTHOR

...view details