తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గడ్డకడుతున్న కశ్మీరం​.. మైనస్​ 30 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు - గడ్డకడుతున్న కశ్మీర్​.. మైనస్​ 30 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

రోజురోజుకు పడిపోతున్న ఉష్టోగ్రతలతో కశ్మీర్​ గడ్డకడుతోంది. జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ ప్రాంతాల్లో సోమవారం రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దాాదాపు -30 డిగ్రీలకు పడిపోయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Kashmir sees fall in minimum temperature
గడ్డకడుతున్న కశ్మీర్​.. మైనస్​ 30 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

By

Published : Feb 3, 2020, 6:52 PM IST

Updated : Feb 29, 2020, 1:09 AM IST

కశ్మీర్​ను చలి పులి వణికిస్తోంది. రోజు రోజుకు ఉష్టోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం ​కశ్మీర్​ లోయలో కనిష్ఠానికి కంటే తక్కువ ఉష్టోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లో రికార్డు స్థాయిలో దాదాపు -30 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రకటించారు.

కార్గిల్​లో ఎన్నడూ లేని విధంగా -27.8 డిగ్రీలు, లద్దాఖ్​ లోని లేహ్​ జిల్లాలో -​16.4 డిగ్రీలు, పాహల్​గ్రామ్​ ప్రాంతంలో -12.5 డిగ్రీలు, ఉత్తర కశ్మీర్​లోని గుల్​మార్గ్​లో -11.5 డిగ్రీల సెల్సియస్​ ఉష్టోగ్రతలు నమోదయ్యాయి.

గరిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు..

లోయలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు సరాసరి 5 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దాదాపు 40 రోజులుగా అతి భయంకరమైన శీతల కాలాన్ని ఎదుర్కొంటున్న చిల్లయి కలాన్​ ప్రాంతంలో మరికొంత కాలం ఈ పరిస్థితి కొనసాగనుందని స్పష్టం చేసింది.

అయితే జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లో వచ్చేవారం వాతావరణం పొడిగా ఉండి.. వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: కరోనా వైరస్​పై కేంద్ర ప్రత్యేక టాస్క్​ఫోర్స్

Last Updated : Feb 29, 2020, 1:09 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details