తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ భూమిపై ఏ శక్తీ దాన్ని ఆపలేదు: రాజ్​నాథ్​సింగ్​

ఆపరేషన్ విజయ్​ 20వ వార్షికోత్సవం పురస్కరించుకుని రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ కార్గిల్​ అమరవీరులకు ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కశ్మీర్​ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని, దీనిని ఈ భూమిపై ఉన్న ఏ శక్తీ ఆపలేదని వ్యాఖ్యానించారు.

By

Published : Jul 21, 2019, 5:52 AM IST

Updated : Jul 21, 2019, 7:01 AM IST

'ఈ భూమిపై ఏ శక్తీ దాన్ని ఆపలేదు': రాజ్​నాథ్​సింగ్​

కశ్మీరు సమస్య కచ్చితంగా పరిష్కారమౌతుందని, భూమ్మీద ఉన్న ఏ శక్తీ దాన్ని ఆపలేదని రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్ పేర్కొన్నారు. 'ఆపరేషన్​ విజయ్​' 20వ వార్షికోత్సవం పురస్కరించుకుని కార్గిల్​ యుద్ధంలో మరణించిన అమరజవాన్లకు ఆయన నివాళులు అర్పించారు.

జమ్ముకశ్మీర్​ డ్రాస్​ సెక్టార్​ వద్ద ఉన్న అమరవీరుల స్మారకం ఆవరణలో ఉన్న వీరభూమిని రాజ్​నాథ్​ సింగ్​ సందర్శించారు. ఆయన వెంట కేంద్రమంత్రి జితేంద్రసింగ్, సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్​రావత్ ఉన్నారు.

కథువాలోని ఉఝ్​, సాంబా జిల్లాల్లోని బసంతర్​ వద్ద సరిహద్దు రహదారుల సంస్థ రూ.50కోట్ల ఖర్చుతో నిర్మించిన రెండు వంతెనలను రాజ్​నాథ్​సింగ్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా..కశ్మీర్​ను ప్రపంచ పర్యటక స్వర్గంగా మార్చాలని ప్రభుత్వం కోరుకుంటోందని ఆయన అన్నారు.

"కశ్మీర్​ సమస్య పరిష్కారం కాబోతోంది. ఈ భూమిపై ఉన్న ఏ శక్తీ దానిని ఆపలేదు."- రాజ్​నాథ్​సింగ్, రక్షణమంత్రి

కశ్మీర్​ను ఉగ్రవాద రహితంగా చేస్తాం..

జమ్ముకశ్మీర్​ లోయను నరకంగా మార్చిన ఉగ్రవాదులను భారత సైన్యం అంతమొందిస్తుందని, త్వరలోనే ఈ నేల ఉగ్రవాద రహిత రాష్ట్రంగా మారబోతోందని రాజ్​నాథ్​సింగ్ ఉద్ఘాటించారు.

కశ్మీర్​లో ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఎంత సమయం పడుతుందని ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. భారత సైన్యం 'ఆపరేషన్​ ఆల్​-అవుట్​'ద్వారా ఉగ్రవాదుల వెన్నెముక విరిచేస్తుందని, ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తుందని రక్షణమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

చర్చలకు ఆహ్వానిస్తున్నాం..

కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజ్​నాథ్​సింగ్​ పేర్కొన్నారు. ఈ కారణంగానే వేర్పాటువాదులను, వారి నాయకులను పదేపదే చర్చలకు ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి: 'కజకిస్థాన్​ ప్రెసిడెంట్స్​ కప్'లో శివ థాపకు స్వర్ణం

Last Updated : Jul 21, 2019, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details