పాకిస్థాన్లోని సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం గురుద్వారా సాహిబ్ను కలిపే కర్తార్పుర్ కారిడార్కు సంబంధించి భారత్-పాక్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా యాత్రకు సంబంధించిన నియమ నిబంధనలపై ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. యాత్రలో ఏం చేయాలి, ఏం చేయకూడదో పేర్కొంది.
దర్బార్ సాహిబ్ దర్శనానికి రోజుకు 5 వేల మందికి మాత్రమే అనుమతినివ్వనున్నారు. పండుగ వేళల్లో, ఇతర సమయాల్లో అవసరాన్ని బట్టి యాత్రికులు సంఖ్య పెంచే అవకాశం ఉంది.
చేయవలసినవి...
⦁ 13 సంవత్సరాల వయసు లోపు పిల్లలు, 75 సంవత్సరాలపైన వయసు కలిగిన వృద్ధులు.. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాలి.
⦁ గురనానక్ దర్శనానికి వచ్చే యాత్రికులు రూ.11 వేలకు మించి వెంట తెచ్చుకోరాదు. 7 కేజీలకు పైగా లగేజీ ఉండకూడదు.
⦁ పర్యావరణ హితమైన వస్తువులు, సంచులు మాత్రమే ఉపయోగించాలి.
⦁ యాత్రకు ఉదయం వచ్చి దర్శనం పూర్తి చేసుకుని సాయంత్రానికి తిరిగి వెళ్లాలి.
⦁ దర్బార్ సాహెబ్ను దర్శించుకోవాలనుకుంటున్న వారు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ పోర్టల్ (prakashpurb550.mha.gov.in)ను నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది.
⦁ ప్రయాణం చేయాల్సిన రోజుకు నాలుగు రోజుల ముందు రిజిస్ట్రేషన్ వివరాలు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా అందుతాయి. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ పత్రం తీసుకోవాలి. పాస్పోర్ట్తో పాటు దీనిని తీసుకెళ్లాల్సి ఉంటుంది.