తెలంగాణ

telangana

కరోనా​ కోసం ఆ రాష్ట్రంలో రూ.200 కోట్లతో నిధి

అతి తక్కువ కాలంలో ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందిన కరోనా వైరస్​ ఇప్పుడు భారత్​ను భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే దేశంలో 151 కేసులు నమోదు కాగా.. అన్ని రాష్ట్రాలు అప్రమత్తమై మహమ్మారిని ఎదుర్కొనేందుకు సన్నద్ధం అవుతున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి. తాజాగా కర్ణాటకలోనూ రూ. 200 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప.

By

Published : Mar 18, 2020, 6:35 PM IST

Published : Mar 18, 2020, 6:35 PM IST

Karnataka to earmark Rs 200 crore to contain COVID-19 spread
కరోనా​ కోసం ఆ రాష్ట్రంలో రూ.200 కోట్లతో నిధి

భారత్​లో మహమ్మారి కొవిడ్​-19ను ఎదుర్కొనేందుకు చర్యలు వేగవంతం అవుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ విద్యాసంస్థలు, థియేటర్లు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు పలు రాష్ట్రాలు భారీగా నిధులను విడుదల చేస్తున్నాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కరోనాపై పోరాటానికి రూ.200 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు.

టాస్క్​ఫోర్స్​ ఏర్పాటు

రాష్ట్రంలో ఈనెల 14 నుంచి విధించిన ఆంక్షలను 31వ తేదీవరకు పొడిగించింది ప్రభుత్వం. అంతేకాకుండా కొందరు మంత్రులతో టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ కార్యదళం ప్రతిరోజూ సమావేశమై వైరస్​ వ్యాప్తిపై ఎప్పటికప్పుడు నివేదికలను సమీక్షిస్తుంది.

"మహమ్మారి కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు రూ.200 కోట్లు మంజూరు చేస్తున్నాం. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరినీ పరీక్షించి 15-16 రోజులు నిర్బంధంలో ఉంచుతాం. శాసనసభ, సచివాలయంలోకి ప్రజలను అనుమతించకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. బహిరంగ కార్యక్రమాలు, పెద్ద ఎత్తున ఉత్సవాలు, వివాహాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించకుండా ఆంక్షలు విధిస్తాం. రాష్ట్రంలో బర్డ్​ఫ్లూ, స్వైన్​ఫ్లూ తదితర వ్యాధులు కూడా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం."

- యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి

కేంద్ర ఆరోగ్యమంత్రి సమీక్ష

కరోనా వైరస్​ వ్యాప్తి నియంత్రణే లక్ష్యంగా... కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు, ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు బృందాలను నియమించాలని ఇవాళ జరిగిన భేటీలో అధికారులను ఆదేశించారు హర్షవర్ధన్​. అన్ని రకాల వైద్య పరికరాలు, సిబ్బంది, మందులు, ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. విమానాశ్రయాలు, ఇతర ముఖ్య రవాణా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు ఉండాలని నిర్దేశించారు.

ఇదీ చదవండి:లైవ్​: మధ్యప్రదేశ్​ రాజకీయాలపై సర్వత్రా ఉత్కంఠ

ABOUT THE AUTHOR

...view details