తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటక సభాపతి రమేశ్​ కుమార్​ రాజీనామా - యడియూరప్ప

కర్ణాటక స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయాల పరంపర కొనసాగుతోంది. యడియూరప్ప సర్కారు బలపరీక్ష నెగ్గిన కాసేపటికే స్పీకర్‌ పదవికి రాజీనామా చేశారు.

కర్ణాటక సభాపతి రమేశ్​ కుమార్​ రాజీనామా

By

Published : Jul 29, 2019, 1:05 PM IST

క్షణానికో మలుపు తిరిగే కన్నడ రాజకీయంలో తాజాగా స్పీకర్ రమేశ్​ కుమార్​ రాజీనామా చేశారు. యడ్యూరప్ప బలపరీక్షలో గెలిచిన వెంటనే తన నిర్ణయాన్ని సభలో ప్రకటించారు.​

"నేను సభాపతి బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. రాజీనామా చేస్తున్నాను. స్పీకర్​ పదవికి ఎలాంటి మచ్చ రాకుండా నా శక్తి మేర పని చేశాను." - రమేశ్​ కుమార్, సభాపతి

రమేశ్​ కుమార్​... కాంగ్రెస్​-జేడీఎస్​ హయాంలో స్పీకర్​గా ఎన్నికయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక... తాను ఆ పదవిలో కొనసాగడం భావ్యంకాదని ఆయన అనుకున్నారని సమాచారం. కూటమి ప్రభుత్వ పతనానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవడం వల్ల తన బాధ్యత పూర్తయినట్లు రమేశ్​ భావించారని తెలుస్తోంది. రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్​కు అందజేశారు.

అన్నీ సంచలనాలే...

రాజకీయ ప్రకంపనలకు కారణమైన అసమ్మతి ఎమ్మెల్యేలపై స్పీకర్‌ రమేశ్​ కొరడా ఝుళిపించారు. మొత్తం 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంత్రిపదవులు వస్తాయని ఆశించిన రెబల్​ ఎమ్మెల్యేలకు స్పీకర్​ నిర్ణయంతో భంగపాటు తప్పలేదు.

రెబల్​ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పుడూ స్పీకర్​ ఎలాంటి తొందరపాటు లేకుండా చాకచక్యంగా వ్యవహరించారు.

ABOUT THE AUTHOR

...view details