తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డిప్యూటీ సీఎం అవ్వాలని.. దేవతకు ఆరోగ్య మంత్రి వినతి! - శ్రీరాములు

కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఓ ఆలయానికి వెళ్లిన ఆరోగ్య మంత్రి శ్రీరాములు.. తాను ఉప ముఖ్యమంత్రి కావాలని కోరుతూ దేవతకు రాసిన అభ్యర్థన లేఖ బహిర్గతమైంది. రాష్ట్రంలో కేబినెట్​ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాల నడుమ.. శ్రీరాములు కోరిక బయటపడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Karnataka Health Minister's letter to Goddess reveals his intend to become Deputy CM
డిప్యూటీ సీఎం పదవి కోసం ఆ ఆరోగ్య మంత్రి దేవతకు వినతి!

By

Published : Sep 17, 2020, 10:24 PM IST

కర్ణాటక ఆరోగ్య మంత్రి బీ.శ్రీరాములుకు డిప్యూటీ సీఎం కావాలని ఉందట! మంత్రి స్వయంగా వెల్లడించలేదు కానీ.. ఓ ఆలయంలో ఆయన దేవతను ఇలా కోరుకున్న విషయం బయటపడింది. ఇటీవల యాదగిరి జిల్లాకు వెళ్లారు మంత్రి శ్రీరాములు. పర్యటనలో భాగంగా గోనాల గ్రామంలోని గాదె దుర్గా దేవీ ఆలయాన్ని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయానికి వెళ్లిన ఆరోగ్య మంత్రి

అనంతరం ఓ చీటీలో.. ''శ్రీరాములు డిప్యూటీ చీఫ్​ మినిస్టర్​ ఆఫ్​ కర్ణాటక, మస్ట్​, కంపల్సరీ'' అని ఆంగ్లంలో రాసి దేవతను ప్రార్థించుకున్నారు. ఇప్పుడిదే బహిర్గతమైంది. ఈ అంశంపై స్పందించారు ఆరోగ్య మంత్రి.

దేవతకు వినతి

''నేను కోరుకున్నది బయటకు చెప్పాలనుకోవట్లేదు. నేను దేవతను నా మనసులో ప్రార్థించాను. ఇప్పుడు నేను రాసిన లేఖ బహిర్గతమైంది. దేవీ దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని నా స్నేహితుడు చెప్పాడు.''

- బీ.శ్రీరాములు, కర్ణాటక ఆరోగ్య మంత్రి.

మంత్రివర్గ విస్తరణ వేళ...

కర్ణాటకలో కేబినెట్​ విస్తరిస్తారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి యడియూరప్ప దిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలో మంత్రి కోరిక బయటపడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

పూజారి ఆశీర్వాదం తీసుకుంటున్న మంత్రి

అయితే ఈ అంశంపైనా స్పందించిన శ్రీరాములు.. ముఖ్యమంత్రి దిల్లీ వెళ్లింది కేబినెట్​ విస్తరణ కోసం కాదని, వేరే పనుల కోసమని మీడియాకు వెల్లడించారు. కర్ణాటకలో ప్రస్తుతం ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు.

ఈడీ విచారణ సమయంలో.. కర్ణాటక ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్​ కూడా ఈ ఆలయ దర్శనం చేసుకున్నారు. అనంతరం.. యాధృచ్ఛికంగా కేపీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ABOUT THE AUTHOR

...view details