తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుటుంబాన్ని కోల్పోయినా... మిత్రుడ్ని కాపాడాడు

కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా థోరా గ్రామంలో కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో ఓ యువకుడి తల్లి, చెల్లెలు కళ్ల ముందే చనిపోయారు. అదే సమయంలో తన స్నేహితుడు ప్రమాదంలో ఉన్నాడు. కుటుంబాన్ని కోల్పోయిన అతను కనీసం స్నేహితుడినైనా దక్కించుకోవాలనుకున్నాడు. ప్రాణాలకు తెగించి కాపాడాడు.

By

Published : Aug 26, 2019, 6:01 AM IST

Updated : Sep 28, 2019, 7:01 AM IST

కుటుంబాన్ని కోల్పోయినా... మిత్రుడ్ని కాపాడాడు

కుటుంబాన్ని కోల్పోయినా... మిత్రుడ్ని కాపాడాడు

దేశంలో కుండపోత వర్షాలకు చాలా రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. కర్ణాటకలోనూ వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు.
కొడుగు జిల్లా థోరా గ్రామంలో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి. నవీన్​ అనే యువకుడి తల్లి, చెల్లెలు తన కళ్ల ముందే మరణించారు. అదే సమయంలో అతడి స్నేహితుడు సతీశ్​ బురదలో చిక్కుకుని మృత్యువుతో పోరాడుతున్నాడు.

కుటుంబాన్ని కోల్పోయిన నవీన్​... స్నేహితుడిని దక్కించుకోవాలనుకున్నాడు. ప్రాణాలకు తెగించి కాపాడాడు.

"నేను పునరావాస కేంద్రాలు ఉన్న ప్రదేశానికి సాయంకోసం వెళ్తున్నాను. అదే సమయంలో పిడుగు పడ్డ శబ్దంతో కొండ చరియలు విరిగి పడ్డాయి. నేను చూసేటప్పటికి నవీన్​ తల్లి, చెల్లెలు చనిపోయారు. నా కాలు పూర్తిగా బురదలో చిక్కుకుపోయింది. అప్పుడు నా స్నేహితుడు నవీన్​ వచ్చి 'నా అమ్మ చెల్లెలిని కాపాడుకోలేకపోయాను. కనీసం నిన్నైనా కాపాడుకుంటా' అని అన్నాడు"

-సతీశ్​​, నవీన్​ స్నేహితుడు

ఇదీ చూడండి:మథుర: ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Last Updated : Sep 28, 2019, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details