తెలంగాణ

telangana

By

Published : Jan 13, 2021, 5:18 AM IST

ETV Bharat / bharat

నేడు కర్ణాటక కేబినెట్​ విస్తరణ- కొత్తగా ఏడుగురికి చోటు!

కర్ణాటక కేబినెట్​ను బుధవారం విస్తరించనున్నారు సీఎం యడియూరప్ప. సాయంత్రం వరకు కొత్త మంత్రి మండలి వివరాలు ప్రకటిస్తామని మంగళవారం చెప్పారు. కేబినెట్​లో కొత్తగా ఏడుగురికి చోటు దక్కుతుందని సూచనప్రాయంగా చెప్పారు. ప్రస్తుత కేబినెట్​లో ఎవరికైనా ఉద్వాసన పలుకుతారా అనే విషయంపై మాత్రం యడియూరప్ప స్పష్టత ఇవ్వలేదు.

Karnataka cabinet expansion likely on Jan 13: CM
నేడు కర్ణాటక కేబినెట్​ విస్తరణ- కొత్తగా ఏడుగురికి చోటు!

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తన మంత్రిమండలిని విస్తరించనున్నారు. కొత్తగా ఏడుగురు సభ్యులకు చోటు కల్పిస్తున్నట్లు మంగళవారం సూచనప్రాయంగా చెప్పారు. కొత్త కేబినెట్​ను బుధవారం సాయంత్రం ప్రకటిస్తానని, వెంటనే నూతన మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందన్నారు.

అయితే నూతన కేబినెట్​ మంత్రులపై మీడియాలో వస్తున్న వార్తలకు, తాను ప్రకటించబోయే దానికి వాస్తవంగా పొంతన ఉండబోదని యడియూరప్ప తెలిపారు. ప్రస్తుత మంత్రిమండలిలో ఎరికైనా ఉద్వాసన పలుకుతారా? అనే విషయంపై ఆయన ఉత్కంఠ కొనసాగిస్తున్నారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ జనరల్​ సెక్రెటరీ ఇంఛార్జ్​ అరుణ్​ సింగ్​లను ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు.

కేబినెట్​ కూర్పుపై హోమంత్రి అమిత్​ షా, జేపీ నడ్డాలతో ఆదివారం భేటీ అయ్యారు యడియూరప్ప. అనంతరం ఏడుగురికి అవకాశం ఇవ్వబోతున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు. భాజపా వర్గాల సమాచారం ప్రకారం ఇద్దరు కేబినెట్​ మంత్రులు చోటు కోల్పోనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: ఐదేళ్లు అధికారంలో ఉంటాం: ఖట్టర్​

ABOUT THE AUTHOR

...view details