తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎం రాజీనామా తట్టుకోలేక పంట నరికేశాడు

అభిమానం శృతి మించితే విధ్వంసాలు తప్పవని నిరూపించాడో రైతు. తమ నాయకుడు రాజీనామా చేశాడని మనస్థాపానికి గురై సొంత పంటను నాశనం చేసుకున్నాడు. ఎకరం విస్తీర్ణంలోని సర్వే తోటను క్షణికావేశంలో నరికిపారేసాడు. తమ నాయకుడికి అన్యాయం జరిగిందని ఉద్వేగంగా మాట్లాడుతున్న రైతు వీడియో ఇప్పుడు వైరల్​ అవుతోంది.

By

Published : Jul 26, 2019, 5:49 AM IST

సీఎం రాజీనామా తట్టుకోలేక పంట నరికేశాడు

సీఎం రాజీనామా తట్టుకోలేక పంట నరికేశాడు
కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కుమారస్వామి వీరాభిమాని తన రెండెకరాల పొలంలో ఉన్న సర్వే చెట్లన్నీ తెగనరికేసి నిరసన తెలిపాడు. తమ నాయకుడు రాజీనామా చేయడం సహించలేని ఆ రైతు ఉద్వేగంలో సొంత పంటను నాశనం చేసుకున్నాడు.పూర్తిగా ధ్వంసం అయిన రెండున్నర ఎకరాల సర్వే చెట్ల తోటను చూపిస్తూ.. కుమారస్వామి రాజీనామా తనకెంత విషాదాన్ని మిగిల్చిందో చెబుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది."కుమారస్వామి రాజీనామా చేస్తే నా పంటను నరికేస్తానని చెప్పాను. అందుకే ఒక ఎకరం పంటను నరికేసాను. ఇంత మంచి ప్రభుత్వాన్ని పడగొట్టాక, ఈ రాష్ట్రంలో ఇంకే ప్రభుత్వం బాగా పనిచేయలేదు. ఛాలెంజ్​ చేశాను నరికేశాను."-కుమారస్వామి అభిమాని, రైతుకుమారస్వామి రాజీనామాపై అసంతృప్తి చెందిన ఎందరో అభిమానులు, తమ నాయకుడు మరింత బాధ పెట్టే పనులు చేయొద్దని పిలుపునిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details